KRNL: పెద్దకడబూరులో గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి కీలక అడుగు పడింది. రూ.1.90 కోట్ల వ్యయంతో 3.O కింద, NREGS పథకం మెటీరియల్ వర్క్స్ ద్వారా సీసీ రోడ్ల నిర్మాణానికి మంజూరు లభించాయి. ఈ మేరకు ఇవాళ రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి రమాకంతరెడ్డి భూమిపూజ చేశారు. గ్రామాల సమగ్ర అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ఆయన పేర్కొన్నారు.