కర్నూలు జిల్లాలో పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరతపై ఇవాళ సీపీఎం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వ్యాపార వర్గాలు లాభాల కోసం కొరత సృష్టిస్తున్నాయని నేతలు ఆరోపించారు. ప్రజలు, రైతులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. తక్షణ చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు చేపడతామని సీపీఎం నాయకులు హెచ్చరించారు.