AP: హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా గత పాలకులు వ్యవహరించారని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆరోపించారు. తిరుమల లడ్డూతోనే కాదు.. వైసీపీ పాలన విధ్వసంతోనే ప్రారంభమైందన్నారు. వందకు పైగా హిందువుల ఆలయాల్లో అపచారాలు చేశారని మండిపడ్డారు. నిజమైన బాధ్యులందరినీ శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. భక్తులకు, ప్రజలకు నమ్మకం కలిగించే బాధ్యత తమపై ఉందన్నారు.