AP: అనంతపురం జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. కోర్టు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్తుతెలియని వ్యక్తులు మరోసారి బెదిరింపు ఈ-మెయిల్ పంపారు. ఆకతాయిలను గుర్తించడంలో పోలీసు యంత్రాంగం విఫలమవుతోంది. రజియా హుసేన్ పేరుతో జిల్లాలోని అన్ని కోర్టులకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. అన్ని కోర్టుల వద్దకు డాగ్ స్క్వాడ్తో వెళ్లి సోదాలు చేస్తున్నారు.