AP: వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విచారణ మరోసారి వాయిదా పడింది. విచారణకు రాలేనంటూ కాకాణి కోవూరు పోలీసులకు లేఖ రాశారు. ఈనెల 27వ తేదీన విచారణకు వస్తానని లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. బాలిక మృతి కేసులో నిరాధార ఆరోపణలు చేశారని కాకాణిపై కేసు నమోదైంది. ఇప్పటికే విచారణ రెండుసార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే.