కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రజలు BPS-LRS స్కీంలను తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని మంత్రి టీజీ భరత్ సోమవారం పిలుపునిచ్చారు. పర్మిషన్ లేకుండా నిర్మించిన భవనాలు, అక్రమ లే-అవుట్లను క్రమబద్ధీకరించుకునే అవకాశం ప్రభుత్వం కల్పించిందన్నారు. BPSకు మార్చి 11 వరకు, LRSకు ఏప్రిల్ 23 వరకు గడువు ఉందన్నారు.