కృష్ణా: గన్నవరం మండలం బుద్ధవరం గ్రామంలో కామ్రేడ్ చింతపల్లి లక్ష్మారాయుడు 6వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఆయన పేదల అభ్యున్నతికి జీవితాంతం కృషి చేశారని కొనియాడారు. గ్రామాభివృద్ధి, పేదలకు నివాస స్థలాల కల్పనలో ఆయన సేవలు చిరస్మరణీయమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.