కృష్ణా: గుడ్లవల్లేరు మండల PHC వద్ద జరుగుతున్న మంచినీటి పైప్ లైన్ మరమ్మత్తు పనులను ఎంపీడీవో ఇమ్రాన్ మంగళవారం పరిశీలించారు. PHC ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం కలగకుండా మరమ్మత్తు పనులను నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత సిబ్బందికి ఎంపీడీవో ఆదేశించారు. ఆస్పత్రి ప్రాంతంలో రోగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.