MBNR: పాలమూరు యూనివర్సిటీ బీటెక్ ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం తగ్గడంపై ఏబీవీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం 47% మంది మాత్రమే పాస్ కావడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని.. పునర్ మూల్యాంకనం రుసుమును పూర్తిగా మినహాయించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు విసి శ్రీనివాస్కు వినతిపత్రం సమర్పించారు.