E.G: ఏపీకి అమరావతి శాశ్వత రాజధానిగా నిలవాలని రాజమండ్రి MP పురందీశ్వరి ఆకాంక్షించారు. బుధవారం పార్లమెంట్ సమావేశాల్లో ఆమె మాట్లాడారు. గత YCP ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం అవివేకపూరితమని విమర్శించారు. ఐదేళ్ల పాటు రాజధానిపై అనిశ్చితి నెలకొందని, అమరావతికి కేంద్ర ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తోందని ఆమె గుర్తు చేశారు.