KMM: పాముకాటుతో వివాహిత మృతి చెందిన ఘటన కొణిజర్ల మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. అన్నవరంకు చెందిన బానోతువాలి మొక్కజొన్న తోటలో కూలి పనులకు వెళ్లింది. ఈ క్రమంలో ఆమె పనిచేస్తుండగా ఆమె కాలికి పాము కాటు వేసింది. దీంతో గమనించిన తోటి కూలీలు ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసు కేసు నమోదు చేశారు.