అంధుడైనా సరే ఆత్మవిశ్వాసంతో ఓ క్యాండిల్ కంపెనీని స్థాపించి 3500 మందికి ఉపాధి కల్పిస్తున్న వ్యక్తి గురించి పోస్ట్ షేర్ చేశారు ఆనంద్ మహీంద్రా. ఇప్పటి వరకు చూసిన అత్యంత స్ఫూర్తినీయ సందేశం ఇదేనని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్గా మారింది.
ఓ ఎమ్మెల్యే కుమారుడు(mla son) ఓ వ్యాపారం డీల్ విషయంలో కంపెనీ సీఈఓ(CEO)ను ఏకంగా తుపాకీ పట్టుకుని బెదిరించాడు. అంతేకాదు అతన్ని వాహనంలో ఎక్కించుకుని పట్టపగలే తీసుకెళ్లారు. అయితే ఈ తతంగం మొత్తం అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు కాగా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా(social media)లో వైరల్ గా మారింది.
ఏపీ రాజకీయాలపై, జనసేన అధినేత పవన్పై నటి రేణూ దేశాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన పిల్లలను రాజకీయాల్లో లాగొద్దని సూచించారు. రాజకీయ పరంగా తన సపోర్ట్ పవన్కే ఉంటుందని ఆమె తెలిపారు. వ్యక్తిగత జీవితాలపై విమర్శలు చేసుకోవడం ఆపాలని సూచించారు.
ఆపద అంటే ఆరున్నర లక్షలను అప్పుగా ఇచ్చిన ఓ వ్యక్తి తనకు అవసరం ఉందని ఎన్నిసార్లు చెప్పినా తీసుకున్న వ్యక్తి తిరిగి ఇవ్వడం లేదని, కుటుంబంతో సహా వెళ్లి అతని ఇంటి ముందు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయత్నం చేశారు.
ఆవులను చాలా పవిత్రమయిన జంతువులుగా భావిస్తాం. కానీ ఈ వీడియోలో మాత్రం ఓ చిన్నారిపై దాడి చేసిన ఆవును చూస్తుంటే చాలా క్రూరంగా కనిపిస్తుంది. అయితే స్కూల్ కు వెళ్తున్న చిన్నారిపై దాడి చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కోడుతుంది.
రాష్ట్రంలో గ్రూప్ 2(group2) ఎగ్జామ్(exam) వాయిదా వేయాలని ఉద్యోగార్థులు TSPSC కార్యాలయాన్ని ముట్టడించారు. గురుకుల పరీక్షలు ఉన్న షెడ్యూల్లోనే ఈ ఎగ్జామ్ కూడా నిర్వహించడం సరికాదన్నారు. దీంతోపాటు పేపర్ లీకేజీ కారణంగా తమ సమయం వృథా అయ్యిందని ఈ నేపథ్యంలో ఎగ్జామ్ మరో రెండు మూడు నెలలు పోస్ట్ పోన్ చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణలో పలువురికి పోలీసులు(police) అంటే కనీసం గౌరవం లేకుండా పోయింది. మద్యం సేవించిన ఓ వ్యక్తికి ఏకంగా మరో వ్యక్తి సపోర్ట్ చేయడమే కాదు. ఏకంగా పోలీసులపైనే దాడికి దిగారు. ఈ సంఘటన ఇటివల జరుగగా..ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
భక్తులు ఉన్న ఆలయంలోకి టెర్రరిస్టుల గుంపు ప్రవేశించింది. ముఖానికి నల్లని మాస్క్లు, చేతులో గన్ను ధరించి పలువురిని బెదిరించారు. దీంతో అక్కడి ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అంతలో ఒక వ్యక్తి వచ్చి సదరు టెర్రరిస్ట్ను ఇవేం పనులు అంటు చెంప పగలగొట్టాడు. తరువాత ఏం జరిగిందంటే..
ఓ బాటిల్ను తలపై పెట్టుకొని బ్యాలెన్స్డ్గా ఓ యువతి సైకిల్ తొక్కిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే ఈ వీడియో చూసిన పలువురు అరె.. అలా ఎలా బ్యాలెన్స్ చేస్తుందని ఆశ్యర్యపోయి చూస్తున్నారు. ఈ క్రేజీ వీడియోను మీరు కూడా చూసేయండి మరి.
ఏపీలో వాలంటీర్ వ్యవస్థకు మచ్చ తెచ్చేలా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వాలంటీర్ ఏకంగా ఓ మహిళ బ్యాంక్ ఖాతా నుంచి ఆమెకు తెలియకుండానే లక్షా 70 వేల రూపాయలను తీసుకున్నాడు. దీంతో ఆమె పోలీసులకు తెలిపింది.
టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ యాక్ట్ చేసిన భోళాశంకర్ మూవీ వివాదాల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్ర నిర్మాతలు ఓ వ్యక్తికి డిస్ట్రిబ్యూషన్ ఇస్తామని చెప్పి మోసం చేశారని వైజాగ్ కు చెందిన ఓ వ్యక్తి కోర్టులో కేసు వేశారు. తనకు న్యాయం జరిగే వరకు ఈ మూవీ రిలీజ్ చేయోద్దని కోరుతున్నారు.
ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో రెండె ఆటలు ఓడిపోయిన భారత్ మూడోది గెలిచి పరువు కాపాడింది. గత రెండు టీ20లలో రాణించిన తిలక్ వర్మతో ఈ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ జతకట్టడంతో విజయం సులువు అయింది.
బిహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ గురించి ప్రస్తుతం ఓ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతుంది. గతంలో ఓ న్యూస్ ఛానెల్ ప్రతినిధిని అన్న మాటలు ఇప్పుడు వైరల్గా మారాయి.
కేసీఆర్, కేటీఆర్లపై రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాము లేకపోతే ఇద్దరు నాంపల్లి దర్గా దగ్గరనో, బిర్లా టెంపుల్ దగ్గరనో లేదా ఆదివారం మెదక్ చర్చి వద్దనో అడుక్కుతినే వారని అన్నారు.