HYD: ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ఎన్నికల కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికలను అడ్డుకున్నారని పేర్కొన్నారు. కోర్టు స్టే పేరుతో ధ్రువీకరణ పత్రం ఇవ్వలేదని ఆరోపించారు.
BHPL: ఆధునిక వ్యవసాయ పద్ధతుల పై అవగాహన కల్పించేందుకు జిల్లా ఉద్యాన శాఖ అధికారి సునీల్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం BHPL, కాటారం డివిజన్లకు చెందిన 50 మంది రైతులను HYDలో జరుగుతున్న “రైతుబడి అగ్రి షో”కు తీసుకెళ్లారు. ఆధునిక సాంకేతికత అవలంబిస్తే తక్కువ వ్యయంతో అధిక దిగుబడులు సాధ్యమని, ఇలాంటి అగ్రి షోలు రైతులకు మార్గదర్శకంగా నిలుస్తాయని అన్నారు.
NRML: ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు డీఐఈవో పరుశురాం శనివారం ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొత్తం 23 కళాశాలలో ఉండగా పరీక్షలకు 13125 మంది విద్యార్థులు హాజరవుతున్నారని మొదటి సంవత్సరం 6652, ద్వితీయ సంవత్సరం 6473 మంది విద్యార్థులు హాజరవుతుండగా వీరి కోసం జిల్లా వ్యాప్తంగా 23 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
HNK: భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ లో నిర్వహిస్తున్న ఉచిత మెగా వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ శనివారం సందర్శించారు. ఈ సందర్బంగా శిబిరంలో ఓపీ నమోదు, ,ప్రాథమిక పరీక్షల కౌంటర్లను కలెక్టర్ పరిశీలించారు. అలాగే ఫార్మసీ కౌంటర్ను సందర్శించి అందుబాటులో ఉన్న మందుల గురించి ఆరాతీశారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.
MDCL: మద్యానికి బానిసై యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన అలవాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. శనివారం అల్వాల్ పోలీసులు తెలిపిన ప్రకారం.. పోలీస్ స్టేషన్ పరిధి హస్మత్పేట్ హరిజన్ బస్తీలో ముద్దంగుల బాలు (33) అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మద్యం కోసం డబ్బులు లేకపోవడంతో ఇంట్లో తలుపులు వేసుకుని సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకున్నాడన్నారు.
SRPT: మునగాల మండలం ఆకుపాముల గ్రామ శివారులో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు కాటన్ లోడుతో వెళుతున్న లారీ, రాంగ్ రూట్లో వస్తున్న మరొక వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్ సల్ప గాయాలతో బయటపడడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
JGL: కథలాపూర్ మండలం ఊటుపల్లి గ్రామంలో నిర్వహించిన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ మహోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారికి నూతన వస్త్రాలు అందజేశారు. ప్రభుత్వం పేద ప్రజలకు గృహ స్వప్నాన్ని నెరవేర్చే లక్ష్యంతో చేపట్టిన ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా అనేక కుటుంబాలు సొంతింటి కల నెరవేరింది అన్నారు.
VKB: బొంరాస్పేట మండలంలోని గుబ్బడి తండాలో ప్రాథమిక పాఠశాల కంపౌండ్ వాల్ నిర్మాణానికి మంజూరు వచ్చింది. ఈరోజు సర్పంచ్ శాంతి బాయ్, గ్రంథాలయ ఛైర్మన్ రాజేష్ రెడ్డి, MGNREGS మెంబర్ నర్సింహులు గౌడ్ అధ్వర్యంలో భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ముఖ్య నాయకులు, తండా వాసులు మరియు పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు.
PDPL: మంథని మున్సిపల్ పరిధిలో ప్రజలు నిరంతరం ఎదుర్కొంటున్న కోతుల సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని నూతనంగా ఎన్నికైన మున్సిపల్ ఛైర్మన్ ఒడ్నాల శ్రీనివాస్, వైస్ ఛైర్మన్ ముసుకుల సయేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. శనివారం మున్సిపల్ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడుతూ.. కోతుల వల్ల ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు.
ADB: రాయితీ బియ్యాన్ని దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి తెలియజేశారు. రాయితీ బియ్యం అక్రమాలను అరికట్టేందుకుగాను పట్టణంలోని రేషన్ డీలర్లతో శనివారం సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. బ్రోకర్లతో కుమ్మక్కై రాయితీ బియ్యానికి దుర్వినియోగం పాల్పడితే కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు.
KNR: సైదాపూర్ మండలం లస్మన్నపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో శనివారం సర్పంచ్ మ్యాకల స్వప్న అంగన్వాడీ పిల్లలకు యూనిఫాంను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. అంగన్వాడీ సేవలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ అందే రాకేష్, వార్డు సభ్యులు తలారి యాదగిరి, మొలుగూరి భారతి, తలారి రాము, గ్రామస్తులు ఉన్నారు.
ADB: నార్నూర్ మండలంలోని ఖైర్థత్వ గ్రామానికి చెందిన యశ్వంత్ అనే వ్యక్తి శనివారం అడవికి వెళ్లి తిరిగి వస్తుండగా అడవి పందులు అకస్మాత్తుగా దాడి చేశాయి. వాటి నుంచి తప్పించుకునే క్రమంలో కిందపడటంతో ఆయన తలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది సచిన్, ప్రదీప్ తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని ప్రథమ చికిత్స అందించారు.
MDK: తూప్రాన్ మండలం ఘనాపూర్ శివారులో అక్రమంగా మట్టి తరలిస్తున్న 9 ట్రాక్టర్లు, ఒక జేసీబీ యంత్రాన్ని సీజ్ చేసినట్లు తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. అక్రమంగా మట్టి తరలిస్తున్నట్లు ఫిర్యాదు రాగా శనివారం దాడులు చేసినట్లు తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా మట్టి అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించి వాహనాలను సీజ్ చేసినట్లు వివరించారు
నల్గొండ: మర్రిగూడ మండలం ఖుదాబాక్షపల్లిలో సర్పంచ్ పందుల జయలక్ష్మి పాండు అధ్యక్షతన శనివారం మొదటి గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ యువకులు పలు సమస్యలను సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. వార్డు సభ్యులు, ప్రభుత్వ సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
MBNR: మహబూబ్ నగర్ ఎస్సీ స్టడీ సర్కిల్ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త అందించింది. డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. ఐదు నెలల పాటు గ్రూప్-1,2,3,4, ఆర్ఆర్బీ బ్యాంకింగ్ పరీక్షలకు ఉచిత కోచింగ్ ఇవ్వబడుతుందన్నారు. డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈనెల 22లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.