RR: రోడ్డు ప్రమాదం జరిగిన ఘటన షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట మండల పరిధిలో చోటు చేసుకుంది స్థానికుల వివరాలు. చేగుంట నుంచి సంతాపూర్ గ్రామానికి వెళ్తున్న డీసీఎం వాహనం సంతాపూర్ గ్రామ శివారులో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కాగా, ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
NRML: సొయా పంటకు మార్కెట్లో ధర లేక రైతులు నష్టపోతున్నారని, తక్షణమే సొయా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే పవార్ రామరావు పటేల్ మంత్రి జూపల్లి కృష్ణారావుకు వినతి పత్రం అందించారు. బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే హరీష్ బాబులతో కలిసి మంత్రిని హైదరాబాద్లో కలిశారు. 4–5 రోజుల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభమవుతాయని హామీ ఇచ్చారు.
ASF: జిల్లాలో RTI జిల్లా మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేయాలని కోరుతూ సమాచార హక్కు రక్షణ చట్టం రాష్ట్ర ఉపాధ్యక్షులు కే.కమలాకర్ బుధవారం కలెక్టర్ వెంకటేష్ దోత్రేకి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచార బోర్డులు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలని కోరారు. దరఖాస్తుదారులకు చట్ట ప్రకారం గడువులోపు సమాచారం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
BHPL: రేగొండ(M) తిరుమలగిరి గ్రామంలో బుగులోని వెంకటేశ్వర స్వామి జాతర అభివృద్ధి పనులను MLA గండ్ర సత్యనారాయణరావు బుధవారం పరిశీలించారు. MLA మాట్లాడుతూ.. రూ.2 కోట్లతో మెట్లు, కొనేరు, మంచినీటి బావి, రూ.5.5 కోట్లతో కొత్తపల్లి, తిరుమలగిరి, జగ్గయ్యపేట నుంచి జాతరకు రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరైనట్లు తెలిపారు. పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
MHB: ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లు ముమ్మరం చేయాలని మంత్రులు కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో మంత్రులు ఉత్తమ్ కుమార్, తుమ్మల నాగేశ్వరరావు, వాకాటి శ్రీహరి, CS రామాక్రిష్ణరావులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీసిలో MHBD జిల్లా నుంచి కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ఉన్నతాధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.
ASF: సిర్పూర్ MLA పాల్వాయి హరీష్ బాబు బుధవారం హైదరాబాద్ సచివాలయంలో కార్మిక శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ, లేబర్ కమిషనర్ దాన కిషోర్ని కలిశారు. సిర్పూర్ పేపర్ మిల్లు పరిశ్రమలో వెంటనే గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. చాలా కాలంగా ఎన్నికలు జరగక పోవడంతో కార్మికుల సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు.
ADB: ఆదిలాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వాణిజ్య శాస్త్ర అధ్యాపకునిగా పనిచేస్తున్న కందుకూరి చంద్రకాంత్, డా. మోహన్ లాల్ దాకా పర్యవేక్షణలో “ది రోల్ ఆఫ్ పేమెంట్ సిస్టమ్స్ ఇన్ ఎన్హాన్స్ ఈ కామర్స్ ట్రాన్సాక్షన్స్ : ఎన్ అనాలిసిస్ ఆఫ్ ద ఎఫెక్టివ్నెస్ అండ్ సెక్యూరిటీ ఆఫ్ వేరియస్ పేమెంట్ మెథడ్స్” అనే అంశంపై పరిశోధన చేసి, నీలం యూనివర్సిటీ నుంచి PhD అందుకున్నారు.
MHBD: మహబూబాద్ పట్టణ కేంద్రంలో ఎమ్మెల్యే డాక్టర్. భూక్యా మురళీ నాయక్ బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా MLA ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన కాంగ్రెస్ కార్యకర్తలను పరామర్శించారు. అనంతరం MLA మాట్లాడుతూ.. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
KMR: పోలీస్ ఉద్యోగం బాధ్యత, సేవతో కూడుతున్నదని SP రాజేష్ చంద్ర అన్నారు. KMR రూరల్ పోలీస్ స్టేషన్ను నేడు సందర్శించారు. ఈ సందర్భంగా సర్కిల్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, కార్యాలయ ఆవరణలో మొక్కను నాటారు. సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కొత్త రికార్డు రూంను ప్రారంభించి పరిశీలించారు. స్టేషన్ పరిశుభ్రత, రికార్డుల నిర్వహణపై సమీక్షించారు.
విద్యార్థుల సంక్షేమం, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని విధులకు హాజరు కావాలని ఉట్నూర్ సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి ఖష్బూ గుప్తా ఒక ప్రకటనలో తెలిపారు. గిరిజన సంక్షేమ వసతి గృహాలలో పార్ట్ టైం/ దినసరి వేతనంతో పని చేస్తున్న 220 మంది సమ్మెలో పాల్గొన్న నేపథ్యంలో వారి 3 నెలల వేతనాన్ని వారి ఖాతాలలో జమ చేయడం జరిగిందని తెలిపారు.
MBNR: నవాబ్పేట మండలం కాకర్లపాడు గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు సంబంధించిన జాబ్ కార్డులు, ఈ-కేవైసీ పనులను బుధవారం ఎంపీడీవో జయరాం నాయక్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధి హామీ కూలీలు తప్పకుండా ఈ-కేవైసీ చేయించాలన్నారు. లేనియెడల బ్యాంకు అమౌంట్ విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయని సూచించారు. కార్యక్రమంలో EC, APO, PS, తదితరులు పాల్గొన్నారు.
SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ప్రిన్సిపాల్ సెక్రటరీ, ఎండోమెంట్ కమిషనర్ శైలజ రామయ్యార్, రాష్ట్ర ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్ హరిత, ఎస్పటీ మహేష్ బి గీతేతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఆలయ అభివృద్ధి పనుల పురోగతిని వారు పరిశీలించారు.
HNK: పరకాల క్రాస్ రోడ్డు వద్ద బుధవారం ఆర్టీసీ బస్సు బైకును ఢీకొట్టడంతో సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి బండారి కొమురయ్య తీవ్రంగా గాయపడ్డారు. హుజురాబాద్(M) పెద్దపాపయ్యపల్లికి చెందిన కొమురయ్య బైక్ పై వస్తుండగా, వరంగల్ నుంచి వస్తున్నా వేములవాడ డిపో బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు ఆయనను ఆసుపత్రికి తరలించారు.
SRCL: 9 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం స్వాధీనం చేసుకుని ఓ వ్యక్తి అరెస్టు చేసినట్టు ముస్తాబాద్ ఎస్సై గణేష్ తెలిపారు. ముస్తాబాద్లోని పోలీస్ స్టేషన్లో బుధవారం ఆయన మాట్లాడారు. ముస్తాబాద్ గ్రామ శివారులో విభూతి సాయిబాబా 9 క్వింటాళ్ల బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేశాడని తెలిపారు. సాయిబాబాను అరెస్టు చేసి, పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామని స్పష్టం చేశారు.
MBNR: ప్రమాదవశాత్తు వాగు గుంతలో పడి వ్యక్తి మృతిచెందిన ఘటన చిన్నచింతకుంట మండలం గూడూరు గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. తిరుమలపురం గ్రామానికి చెందిన దాసరి కృష్ణయ్య (50) గ్రామంలోని పోచమ్మ ఆలయం సమీపంలోని వాగు గుంతలో చేపల వేటకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు గుంతలో పడి మృతిచెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనపై విచారణ చేపట్టారు.