MBNR: బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ రేపు బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ బంద్కు సంపూర్ణ మద్దతు పలుకుతుందని మాజీ మంత్రి డాక్టర్ వీ. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కామారెడ్డి డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ అమలు చేయాలన్నారు.
HYD: స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టులో మరో పిటిషన్ వేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు రీ నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు నిర్వహించాలని పిటిషన్ వేశారు. ఈ నెల 9న స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ సస్పెండ్ చేస్తూ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు ఇచ్చింది. నోటిఫికేషనన్ను సస్పెండ్ చేయడానికి సవాలు చేస్తూ సురేందర్ అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు.
KMM: BC రిజర్వేషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆమోదం తెలపాలని CPIML మాస్ లైన్ జిల్లా నాయకులు తిమ్మిడి హనుమంతరావు అన్నారు. BC రిజర్వేషన్ బిల్లును రాష్ట్రపతి, గవర్నర్ ఆమోదించకపోవడాన్ని నిరసిస్తూ శుక్రవారం తిరుమలాయపాలెం (M) కాకరవాయిలో ధర్నా చేశారు. BC రిజర్వేషన్పై రేపు జరిగే బంద్కు CPIML మాస్ లైన్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు.
VKB: సంక్షేమ హాస్టళ్లలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు నాణ్యమైన సరుకులను పంపిణీ చేయాలని ఎంపీడీవో రామకృష్ణ అన్నారు. కుల్కచర్ల మండలంలోని సంక్షేమ హాస్టల్లో సరుకులను పరిశీలించారు. టెండర్ తీసుకొని సరుకులు పంపిణీ చేస్తున్న వ్యక్తులు నాణ్యమైన సరుకులను ఇవ్వకపోతే వారి టెండరు రద్దు చేస్తామని హెచ్చరించారు. అధికారులు, ఉపాధ్యాయలు, హాస్టల్ సిబ్బంది ఉన్నారు.
WGL: మామునూరు విమానాశ్రయ అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 90కోట్లు మంజూరు చేసిన నేపథ్యంలో వర్ధన్నపేట MLA కేఆర్ నాగరాజు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మామునూరు ఎయిర్పోర్ట్ విస్తరణ, టెర్మినల్ బిల్డింగ్ నిర్మాణం, రన్వే పొడిగింపు, లైటింగ్, సెక్యూరిటీ ఫెన్సింగ్ వంటి కీలక పనుల కోసం ఈ నిధులను మంజూరు ఇస్తూ జీవో జారీ చేసిందని తెలిపారు.
ASF: ITDA డైలీ, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రటరీ సవ్యసాచి ఘోష్కు ఆసిఫాబాద్ MLA కోవ లక్ష్మి వినతిపత్రం అందజేశారు. 30 ఏళ్లుగా ITDA పరిధిలో విధులు నిర్వహిస్తున్న డైలీ, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులంతా ఆదివాసీలన్నారు. వీరికి ఉద్యోగ భద్రత కల్పించకపోవడం బాధాకరమని, జీతాలు ప్రతి నెల రావడంలేదని వారి సమస్యలు పరిష్కరించాలన్నారు.
SRD: కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు నిరుపేదలకు వరంగా మారాయని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం పటాన్ చెరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నియోజకవర్గం పరిధిలోని అమీన్పూర్, రామచంద్రపురం, గుమ్మడిదల, జిన్నారం, పటాన్ చెరు రెవెన్యూ మండలాల పరిధిలోని 105 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.
SRPT: నేడు యువజన భారత ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలకు భూమి పూజ కార్యక్రమంను తెలంగాణ రాష్ట్ర విద్య మరియు సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండలం తొండ గ్రామంలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మందుల సామేల్ హాజరై భూమి పూజ చేయనున్నారు.
MNCL: కాసిపేట మండలంలోని దేవాపూర్ సల్పల వాగు ప్రాంతంలో ఆదివాసీల దండారి సంబరాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. బెల్లంపల్లి ACP ఏ. రవికుమార్, మందమర్రి CI శశిధర్ రెడ్డిలకు ఆదివాసి సంఘం నాయకులు అపూర్వ స్వాగతం పలికారు. గుస్సాడీ నృత్యాలతో సందడి చేశారు. సాంప్రదాయ రీతిలో నిర్వహించిన ఆదివాసీల కార్యక్రమాలు అందరిని అలరించాయి.
BHPL: జిల్లా ఎక్సైజ్ శాఖ పరిధిలో 59 మద్యం దుకాణాలకు దరఖాస్తులు తక్కువగా వస్తున్నాయి. గురువారం వరకు 22 షాపులకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. గత ఏడాది ఈ సమయంలో 2,261 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు గడువు ఈ నెల 18తో ముగియనుండగా, 183 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఈ నెల 17, 18న అధిక సంఖ్యలో దరఖాస్తులు వచ్చే అవకాశమని ఎక్సైజ్ SP శ్రీనివాస్ ఇవాళ తెలిపారు.
KMM: రఘునాథపాలెం మండలంలో వీధికుక్కల బెడద రోజురోజుకు ఎక్కువవుతుందని స్థానికులు తెలిపారు. మంచుకొండ, పండిగి, కోయచలక, జింకలతండా, బలపేట తదితర గ్రామాల్లో రాత్రి వేళల్లో రోడ్డుపై వెళ్లే వాహనాల వెంట పడి వాహనదారులను గాయపరుస్తున్నాయని అన్నారు. అటు చిన్న పిల్లలపై కూడా దాడికి పాల్పడుతున్నాయని స్థానికులు వెల్లడించారు. కుక్కల నివారణకు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు తెలిపారు.
RR: బీసీ రిజర్వేషన్ల కోసం 18న రాష్ట్రంలో జరగనున్న బంద్కు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీలంతా ఐక్యమత్యంతో పోరాడి చట్టపరంగా రిజర్వేషన్లు సాధిస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుందని, పార్లమెంట్లో చట్టాన్ని తెచ్చుకోవడానికి బీసీలందరూ ఉద్యమించాలన్నారు.
GDWL: ఈనెల 22వ తేదీలోపు రైతులు దరఖాస్తు చేసుకుంటే రాయితీలపై వ్యవసాయ పరికరాలు అందజేస్తామని కేటీదొడ్డి మండల వ్యవసాయ అధికారి రాజవర్ధన్ రెడ్డి తెలిపారు. మండలంలోని ఎస్టీ, ఎస్సీలతోపాటు సన్న, చిన్నకారు రైతులకు 50%, జనరల్ కేటగిరిలో 40% రాయితీ ఉంటుందన్నారు. రకరకాల పరికరాలను యాంత్రీకరణ పథకం ద్వారా అందజేస్తామన్నారు.
MBNR: మిడ్జిల్ మండల వ్యాప్తంగా ఇటీవల ప్రభుత్వం గ్రామ పరిపాలన అధికారులను నియమించింది. అందులోనే భాగంగా శుక్రవారం నుంచి గ్రామాలలో వారు సేవలందించనున్నట్లు ఎమ్మార్వో రాజు తెలిపారు. గ్రామ ప్రజలు ఏ విధమైన ధ్రువపత్రాలు అవసరమున్నచో ముందుగా గ్రామ పరిపాలన అధికారిని సంప్రదించాలన్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలోని ఇన్వార్డులో మీయొక్క ధ్రువపత్రాలు ఇవ్వాలన్నారు.
KMM: కేంద్రంలో ఉన్న బీజేపీ చేస్తున్న ఓటు చోరీపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటంలో ప్రజలు భాగస్వాములు కావాలని మండల కాంగ్రెస్ నాయకులు పిచ్చిరెడ్డి అన్నారు. శుక్రవారం ఎర్రుపాలెం (మం) బనిగండ్లపాడులో Dy.Cm భట్టి ఆదేశాల మేరకు ఓటు చోరీపై సంతకాల సేకరణ నిర్వహించారు. ఓట్ చోరీ చేసి ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని, దీనిపై ప్రతి ఒక్కరు పోరాడాలన్నారు.