NZB: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గురువారం రాష్ట్ర కార్యవర్గాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా, వివిధ జిల్లాలకు ఆటో జాగృతి అధ్యక్షులను నియమించారు. ఈ మేరకు ఆమె అధికారిక ప్రకటన విడుదల చేశారు. నిజామాబాద్ ఆటో జాగృతి జిల్లా అధ్యక్షుడిగా బి.శ్రీనివాస్ను, కామారెడ్డి జిల్లా ఆటో జాగృతి అధ్యక్షుడిగా MD అల్తాఫ్ను ఎంపిక చేశారు.
PDPL: స్వచ్ఛ సర్వేక్షణ్- 2025లో ఉత్తమ ర్యాంకు సాధించడమే లక్ష్యమని రామగుండం కమిషనర్ అరుణశ్రీ తెలిపారు. 15 రోజులుగా జరిగిన స్వచ్చతా హీ సేవా కార్యక్రమం నిన్న ముగింపు సమావేశంలో ఉత్తమ పారిశుద్ధ్య సేవలందించిన సిబ్బందిని శాలువాలతో సత్కరించి, మెమెంటోలు అందించారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా శుభ్రతపనులు చేపట్టాలని ఆమె పిలుపునిచ్చారు.
GDWL: ప్రియదర్శిని జూరాల జలాశయానికి ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద ప్రవాహం స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. శుక్రవారం ప్రాజెక్టుకు 2,87,000 క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదవుతోందని ప్రాజెక్టు అధికారి వెంకటేష్ తెలిపారు. జలాశయంలో ప్రస్తుతం 9.657 టీఎంసీల నీరు నిల్వ ఉందని, 2,77,176 క్యూసెక్కుల అవుట్ ఫ్లో ఉండటం వలన, దిగువకు విడుదల చేసేందుకు 15 గేట్లు ఎత్తివేసినట్లు నేర్కొన్నారు.
NZB: గడిచిన 24 గంటల్లో SRSPలోకి ఎగువ ప్రాంతాల నుంచి 2,55,961 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చింది. 1,88,611 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలినట్లు ప్రాజెక్టు అధికారులు శుక్రవారం ఉదయం తెలిపారు. ఇందులో 24 స్పిల్ వే గేట్ల ద్వారా 1,79,171 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు.69.855 TMC నీరు నిల్వ ఉందని అధికారులు వెల్లడించారు.
HYD: మూసీ నది అందాలు కనువిందు చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. నగరంలో మూసీ నది దాదాపు 55 కిలోమీటర్ల మేర విస్తరించింది. ముందుగా 20.5 కిలోమీటర్లను సుందీకరించనున్నారు. ఇందుకు దాదాపు రూ.5,641 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేయనుంది. హిమాయత్ సాగర్ నుంచి బాపూఘాట్ వరకు (9.5KM), ఉస్మాన్ సాగర్ నుంచి బాపూఘాట్ (11 KM) వరకు సుందరీకరించనున్నారు.
MBNR: విజయదశమి ప్రతి ఒక్కరి జీవితాలలో విజయం తీసుకురావాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం రాత్రి జిల్లా కేంద్రంలోని బాలుర కళాశాల మైదానంలో దసరా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెడు పనులు చేసేవారి ఆలోచనలను అమ్మవారు తుడిచేయాలని పేర్కొన్నారు.
BDK: క్రీడాకారులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ హామీ ఇచ్చారు. గురువారం దమ్మపేట మండలం రాచూరుపల్లిలో స్థానిక యూత్ నిర్వహించిన, ఉమ్మడి జిల్లాల వాలీబాల్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ టోర్నమెంట్కు ఎమ్మెల్యే, ముఖ్య అతిథిగా హాజరై విజేత జట్లకు ఎమ్మెల్యే బహుమతులు అందజేశారు.
BDK: చండ్రుగొండ మండలం కనకగిరి గుట్టల్లో హస్తాల వీరన్న, ఆలయాన్ని గురువారం విజయదశమి పండుగ సందర్భంగా భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ దర్శించుకున్నారు. వీరన్న ఆలయాన్ని సందర్శించిన ఎస్పీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మారుమూల ప్రదేశంలో ఉన్న వీరన్న ఆలయం ఎంతో సుందరంగా ఉందని ఎస్పీ ఆనంద వ్యక్తం చేశారు. వారితో పాటు డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ ఉన్నారు.
HYD: పాతబస్తీలోని ఫలక్నూమ ROBని సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ప్రారంభించనున్నారు. రూ.52.03 కోట్లతో 360 మీటర్ల పొడవున GHMC SCR సంయుక్తంగా దీన్ని నిర్మించాయి. ఈ బ్రిడ్జి బార్కస్ నుంచి చార్మినార్ రూట్తో పాటు ఫలక్నూమ ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. డిప్యూటీ సీఎం భట్టి, ఇతర మంత్రులు ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.
NZB: వేల్పూర్ మండల కేంద్రంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. దీంట్లో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
HYD: నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నేడు మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో అలయ్ బలయ్ సమ్మేళనం జరగనుంది. పుష్కర కాలం నుంచి దసరా మరుసటి రోజున నిర్వహిస్తున్న ఈ వేడుకకు పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్రమంత్రులు, మంత్రులు, ఇతర రాజకీయ పార్టీల నేతలు హాజరుకానున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, వంటకాలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
GDWL: నడిగడ్డ ఇలవేల్పు దైవం జమ్మిచేడు జమ్ములమ్మను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, బండ్ల జ్యోతి దంపతులు గురువారం దర్శించుకున్నారు. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారి దర్శనానికి వచ్చిన వారికి ఆలయ అర్చకులు సాదరంగా స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం వేద ఆశీర్వచనం చేసి శేష వస్త్రంతో సత్కరించారు.
NLG: సీపీఐ జాతీయ కార్యదర్శిగా నూతనంగా ఎన్నికైన మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్ రెడ్డిని గురువారం దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. దేవరకొండ మండలంలోని పడమటి పల్లిలో వారి నివాసంలో కలిసి పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. సిరాజ్ ఖాన్, పల్లా నరసింహారెడ్డి, గోపాల్ రావు తదితరులు వారితో ఉన్నారు.
BDK: కొత్తగూడెంలో రోడ్డు ప్రమాదంలో జరిగినట్లు స్థానికులు తెలిపారు. గురువారం రాత్రి ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తి బిక్షపతి బోర్వేర్ లారీ ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. పాత కొత్తగూడెం నుంచి బైక్పై వెళ్తేన్న బిక్షపతిని సింగరేణి మెయిన్ హాస్పిటల్ వద్ద ఈ ప్రమాదం జరిగిందని అన్నారు. అతడిని స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
BDK: శుభ్రత, సమయపాలన, సమర్థవంతమైన కార్యనిర్వాహణ ముఖ్యమని ఏరియా మేనేజర్ షాలేము రాజు అన్నారు. కేంద్రం ఆదేశాల మేరకు సింగరేణి ఏరియాలో గురువారం నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు స్వచ్ఛత స్పెషల్ క్యాంపెయిన్ 5.0 కార్యక్రమం ప్రారంభమైందని వారు తెలిపారు. ప్రతి ఉద్యోగి పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం స్పెషల్ క్యాంపెయిన్ ప్రతిజ్ఞ చేశారు.