• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

KTRకు ఘన స్వాగతం.. కాంగ్రెస్ సర్కార్‌పై విమర్శలు

NZB: ఆదిలాబాద్ వెళ్తున్న మాజీ మంత్రి KTRకు ఆర్మూర్లో బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా KTR మాట్లాడుతూ.. ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ, పెన్షన్ల పెంపు గురించి అడిగితే ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేయడం సిగ్గుచేటన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ అరాచకాలను బయటపెడతామని హెచ్చరించారు.

February 24, 2026 / 02:40 PM IST

వాహనదారులకు అవగాహన కలిపించిన MLA

WGL: నెక్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు ఎస్సై మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వాహనదారులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నర్సంపేట MLA దొంతి మాధవరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వాహనదారులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. వాహనదారులు ప్రతి ఒక్కరు ఎలిమెంట్ ధరించి వాహనం నడపాలని కోరారు.

February 24, 2026 / 02:40 PM IST

బాధిత కుటుంబాలకు అండగా CRMF: ఎమ్మెల్యే

GDWL: అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రతి పేదవాడిని ఆదుకోవడమే మా లక్ష్యం అని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు పేర్కొన్నారు. ఐజ మండలం మేడికొండ గ్రామానికి చెందిన ఈ ఇద్దరి ఆపరేషన్ల నిమిత్తం మొత్తం రూ. 12 లక్షల విలువైన LOC పత్రాలను ఆయన మంగళవారం వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. సర్కారు సాయం అందటంతో ఆ కుటుంబాల్లో వెలుగులు నిండాయి.

February 24, 2026 / 02:38 PM IST

ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన

KNR: సైదాపూర్ మండలంలోని పెరకపల్లి గ్రామంలో మంగళవారం రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమం జరిగింది. ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కుమార్ యాదవ్, ఫీల్డ్ కోఆర్డినేటర్ అనూష, రమేష్‌ల ఆధ్వర్యంలో 20 లీటర్ల అగ్ని అస్త్రం తయారీ, దాని ఉపయోగాలు, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను రైతులకు వివరించారు. నేల ఆరోగ్యం, పర్యావరణ కాలుష్యం నివారణకు ప్రకృతి వ్యవసాయం ఆవశ్యకతను తెలిపాలి.

February 24, 2026 / 02:38 PM IST

జిల్లా కోర్టు ఎదుట న్యాయవాదుల ధర్నా

NZB: న్యాయవాదిపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని లాయర్లు డిమాండ్​ చేశారు. ఈ మేరకు మంగళవారం NZB బార్​ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులు బహిష్కరించి కోర్టు ఎదుట ధర్నా చేశారు. న్యాయవాది పరిషత్ జిల్లా అధ్యక్షుడు జగన్​ మోహన్​ గౌడ్​ మాట్లాడుతూ.. మహిళ న్యాయవాది కళ్యాణిపై ఆదివారం రుద్రూర్​లో గుండాలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.

February 24, 2026 / 02:36 PM IST

జిల్లా నిరుద్యోగులకు శుభవార్త.. పోస్టులు ఖాళీలు

BDK: భద్రాద్రి జిల్లాలోని నిరుద్యోగులకు జిల్లా ఉపాధి కల్పనాధికారి కొండపల్లి శ్రీరాం శుభవార్త చెప్పారు. పాల్వంచలోని ప్రైవేట్ సంస్థలు 25 సెక్యూరిటీ గార్డ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. టెన్త్ పాసై, 21 నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్న పురుష అభ్యర్థులు అర్హులని చెప్పారు. ఈనెల 26న చుంచుపల్లి ఎంపీడీవో కార్యాలయంలో ఉదయం 10 ఇంటర్వ్యూకు హాజరు కావాలన్నారు.

February 24, 2026 / 02:36 PM IST

‘పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ఠ పోలీసు బందోబస్తు ఏర్పాటు’

ASF: ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ఠ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా SP నితిక పంత్ మంగళవారం తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. పరీక్షల సమయంలో జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. సెంటర్ల వద్ద మొబైల్ ఫోన్ లు తీసుకోని రావద్దన్నారు.

February 24, 2026 / 02:32 PM IST

‘ప్రతి రైతుకి ఫార్మర్ ఐడీ తప్పనిసరి’

MBNR: వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ప్రతి రైతుకు అందాలంటే ఫార్మర్ ఐడీ అనేది తప్పనిసరి అని మహమ్మదాబాద్ మండలం నంచర్ల క్లస్టర్ ఏఈవో మౌనిక తెలియజేశారు. రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకొని ఫార్మర్ ఐడీని పొందడానికి ఆధార్ కార్డు, పట్టాదారు పాస్ బుక్, ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నెంబర్ తీసుకొని రైతు వేదిక దగ్గరికి రావాలన్నారు.

February 24, 2026 / 02:32 PM IST

కాశీయాత్రికులకు మాజీ ఎంపీ సన్మానం

WNP: పట్టణానికి చెందిన పలువురు ఆర్యవైశ్యులు మంగళవారం కాశీ యాత్రకు బయలుదేరివెళ్లారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి హైదరాబాద్‌లోని కాచిగూడ రైల్వే స్టేషన్‌లో వారికి పూల బొకేలు అందజేసి శాలువాలతో సత్కరించారు. కాశి యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకొని క్షేమంగా తిరిగి రావాలని రావుల శుభాకాంక్షలు తెలిపారు. 

February 24, 2026 / 02:32 PM IST

అకాల వర్షం.. అనుకోని నష్టం

SDPT: జిల్లాలో సోమవారం సాయంత్రం కురిసిన అకాల వర్షం పంటలను దెబ్బతీసింది. ముఖ్యంగా మిరుదొడ్డి, దుబ్బాక మండలంలోని పలు గ్రామాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. కొండాపూర్, అందె తదితర గ్రామాల్లో మొక్కజొన్న పొద్దుతిరుగుడు పంటలు నేలవాలాయి. కూరగాయల తోటలు ధ్వంసమయ్యాయి. పలుచోట్ల రోడ్లపై అడ్డంగా చెట్లు పడడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి.

February 24, 2026 / 02:30 PM IST

హాస్పిటల్ పనుల ఆలస్యంపై హరీష్ రావు ఘాటు విమర్శలు

WGL: వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులను నేడు పరిశీలించిన మాజీ మంత్రి హరీష్ రావు, ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. హాస్పిటల్ పనులు జూన్ 2వ తేదీకి పూర్తి కావడం ఆలస్యం అవుతోందని, ఎంజీఎం హాస్పిటల్‌లో గుండె చికిత్సలు, ఆక్సిజన్, మందుల కొరత, వైద్య సిబ్బంది సమస్యలు ఉన్నాయని, ప్రజలకు హాస్పిటల్ సేవలు సేవలు అందకపోవడం ప్రాణాల కోల్పోడానికి కారణమవుతున్నారు.

February 24, 2026 / 02:29 PM IST

రైతుబంధు ఇక లేనట్లే..!

KMM: క్యాబినెట్ మీటింగ్‌లో రైతుబంధు ప్రస్తావన ఈసారి కూడా రాలేదు. డిసెంబర్‌లో ఇవ్వాల్సిన రైతుబంధు ఎన్నికలు అయిపోయి పొలంలో నాట్లు వేయడం కూడా అయ్యేవరకు రైతుల ఖాతాలోకి జమ కాలేదు. క్యాబినెట్ మీటింగ్‌కు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరు కాలేదు. మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతుబంధు ఇస్తామని తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి కానీ నేడు ఆ ప్రస్తావన లేదు.

February 24, 2026 / 02:28 PM IST

పసిపాప మృతికి నిరసనగా బీసీ కుల సంఘాల ఆందోళన

NZB: నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో పసిపాప మృతికి నిరసనగా మంగళవారం NZBలో బీసీ కుల సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. బీసీ సంక్షేమ సంఘం, రజక ఐక్య వేదిక, వీరనారి చాకలి ఐలమ్మ రజక సంఘం, బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ, భీమ్ ఆర్మీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి ధర్నా చౌక్లో మానవహారం ఏర్పాటు చేసి రోడ్డుపై బైఠాయించారు.

February 24, 2026 / 02:20 PM IST

బహదూరురాలో నిలిచిన నీరు.. అధికారుల చర్యలు

HYD: రామదేవ్ ఆలయం సమీపంలో రోడ్డుపై నీరు నిలవడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం హైడ్రా సిబ్బంది మోటార్ల సాయంతో నీటిని తొలగిస్తున్నారు. ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉన్నందున, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.

February 24, 2026 / 02:20 PM IST

ఈనెల 27న కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది సభ

NLG: కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఈనెల 27న హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన్ కేంద్రంలో నిర్వహించే బహిరంగ సభను జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి సాగర్ పిలుపునిచ్చినారు. మంగళవారం నల్లగొండ పట్టణంలో సభకు సంబంధించిన పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. నిత్యం ప్రజా ఉద్యమాలు చేసేది కమ్యూనిస్టులే అన్నారు.

February 24, 2026 / 02:19 PM IST