కామారెడ్డి జిల్లావ్యాప్తంగా శనివారం జరిగిన ఇంటర్ పబ్లిక్ పరీక్ష ముగిసింది. మొత్తం 37 పరీక్షా కేంద్రాల్లో 7,840 మంది విద్యార్థులకు గాను 7,692 మంది హాజరయ్యారు. 148 మంది విద్యార్థులు గైర్హాజరు కాగా, జిల్లాలో సగటు హాజరు శాతం 98.11గా నమోదైందని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. అన్ని కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన నిఘా, మౌలిక వసతులు కల్పించారు.
KNR: జిల్లా కేంద్రంలోని SRR ప్రభుత్వ కళాశాలలో శనివారం జాతీయ సైన్స్ దినోత్సవం పురస్కరించుకొని వృక్ష శాస్త్ర విభాగం ప్రొఫెసర్ డాక్టర్ పడాల మాట్లాడారు. మన దేశ శాస్త్రవేత్తలను గౌరవిస్తూ, మూఢనమ్మకాలను విడిచి శాస్త్రీయ దృక్పథంతో మెలుగుదామన్నారు. “వికసిత భారత్” కల సాకారం కావాలంటే ప్రతి విద్యార్థి ఒక చిన్న శాస్త్రవేత్తగా ఆలోచించాలని అన్నారు.
MLG: వాజేడు MPDO కార్యాలయంలో సూపర్డెంట్గా విధులు నిర్వహిస్తున్న శ్రీధర ఉమారాణి (52) అనారోగ్యంతో శనివారం ఉదయం మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యా సమస్యలతో బాధపడుతూ చికిత్స పొందుతున్న ఆమె స్వగృహంలోనే కన్నుమూశారు. ఆమె మృతి పట్ల ఎంపీడీవో, సంబంధిత అధికారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
SRPT: నేరేడుచర్ల మండలం వైకుంఠాపురం గ్రామంలో పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా శనివారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. బడుగు, బలహీన వర్గాల హక్కులకు భంగం కలగకుండా చూడటమే లక్ష్యంగా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. గ్రామస్తుల సమస్యలను వారి వద్దకే వెళ్లి తెలుసుకుని, తక్షణ పరిష్కారం చూపే దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో సర్పంచ భవాని, అధికారులు పాల్గొన్నారు.
NRML: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలలో భాగంగా భైంసా పట్టణంలోని పలు పరీక్షా కేంద్రాలను శనివారం జిల్లా ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. పరీక్షలను పారదర్శకంగా నిర్వహించే భాగంలో తనిఖీ నిర్వహించడం జరిగిందని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ తనిఖీలలో ప్లయింగ్ స్క్వాడ్ రవీందర్,డిఓ వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
SRCL: చందుర్తి మండలం సనుగుల ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సివి రామన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు సందర్భంగా ఇన్ ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు గుర్రం మల్లారెడ్డి మాట్లాడుతూ .. భారతీయ భౌతిక శాస్త్రవేత్త సివి రామన్ 1928లో కనుగొన్న రామన్ ఎఫెక్ట్కు గౌరవంగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని అన్నారు.
HYD: అంతర్జాతీయ స్థాయి క్రీడలకు నిలయమైన గచ్చిబౌలి స్టేడియం ముఖద్వారం వద్దే అపరిశుభ్రత రాజ్యమేలుతోంది. స్టేడియం ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద వెలుస్తున్న అక్రమ ఫుడ్ స్టాల్స్ కారణంగా ఆ ప్రాంతమంతా అధ్వానంగా తయారవుతోంది. దీనిపై స్థానిక క్రీడాకారులు, నగరవాసులు సైబరాబాద్ పోలీసులకు, మున్సిపల్ అధికారులకు సామాజిక మాధ్యమాల వేదికగా ఫిర్యాదు చేస్తున్నారు.
ADB: గుడిహత్నూర్ మండలంలోని ముత్నూర్ గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీ హల్ నిర్మాణానికి ఇవాళ బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ భూమి పూజ చేశారు. ముత్నూర్ గ్రామస్తుల కోరికలను కచ్చితంగా నెరవేరుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జాదవ్ కరుణ భీంరావ్ నాయాక్. మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ తిరుమల్ ఉన్నారు.
HYD: కుమ్మెర మల్లన్న జాతర బాధితులు ఉస్మానియా యూనివర్సిటీలో ర్యాలీ నిర్వహించారు. ధర్మాసమాజ్ పార్టీ, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ ఘటనకు కారణమైన వారిపై కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. బాధితులకు రోజు రోజుకు మద్దతు పెరుగుతుంది. నిన్న డీజీపీని కలిసి రెండు నెలల పాప చావుకు కారణమైన వారిపై కేసులు నమోదు చేయాలని కోరారు.
MBNR: ప్రజలంతా ట్రాఫిక్ నిబంధనలు పాటించి రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని హన్వాడ మండల ఎస్సై వెంకటేష్ అన్నారు. రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా మండల కేంద్రంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఎస్సై హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలు మద్యం తాగి ఎట్టి పరిస్థితిలోనూ వాహనాలు నడపకూడదన్నారు. పోలీసులకు సహకరించాలన్నారు.
NZB: బోధన్ పట్టణంలోని శంకర్ నగర్ (22వ వార్డు)లో కౌన్సిలర్ మిద్దెల రామరాజు శనివారం పారిశుద్ధ్య పనులను స్వయంగా పరిశీలించారు. మున్సిపల్ జవాన్ మహబూబ్తో కలిసి వార్డు అంతటా తిరుగుతూ పారిశుద్ధ్య నిర్వహణను పర్య వేక్షించారు. వార్డును ఆదర్శంగా, పరిశుభ్రంగా ఉంచడమే తమ లక్ష్యమని, ప్రజలు కూడా పరిసరాల పరిశుభ్రతలో భాగస్వాములు కావాలని కోరారు.
RR: శంకర్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని బీీవి.ఆర్ గార్డెన్ వద్ద నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని, ప్రతి అర్హుడికి ఇల్లు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
SDPT: చిన్నకోడూరు మండలంలోని మేడిపల్లి ప్రాథమిక పాఠశాలలో స్వయం స్వపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. బోధనలో ప్రతిభ కనబరచిన విద్యార్థులకు పాఠశాల ఉపాధ్యాయులు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
MDCL: అల్వాల్ సర్కిల్ పరిధిలోని మచ్చ బొల్లారం మార్కెట్ రోడ్డులో ఫుట్పాత్లపై జరిగిన ఆక్రమణలను ట్రాఫిక్, మున్సిపల్, పోలీస్ అధికారులు సంయుక్తంగా తొలగించారు. రహదారిపై అనధికారికంగా ఏర్పాటు చేసిన షెడ్లు, వ్యాపార స్టాళ్లు, ఇతర వస్తువులను తొలగిస్తూ పాదచారులకు సౌకర్యవంతమైన మార్గం కల్పించారు. మార్కెట్లో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ చర్యలని అధికారుల తెలిపారు.
BDK: ఏజెన్సీ ఏరియాలో గిరిజన చట్టాలను తుంగలో తొక్కుతున్న అధికారులు పట్టించుకోవడంలేదని గోండ్వానా సంక్షేమ పరిషత్ చర్ల మండల వర్కింగ్ ప్రెసిడెంట్ వరప్రసాద్ ఆరోపించారు. శనివారం కొయ్యూరు గ్రామంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. చర్ల మండలం కేంద్రంలో ఏజెన్సీ చట్టాలను గిరిజనేతరులు అతిక్రమిస్తున్న అధికారులు మౌనం పాటిస్తున్నారని చెప్పారు.