MHBD: ఇనుగుర్తి మండలంలోని చిన్న నాగారం కంపార్ట్మెంట్ 1139 ఆటవిలోని జామాయిల్ తోటలో గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో మంటలు చెలరేగాయి. దీంతో తోటలో దట్టమైన పొగతో మంటలు వస్తుండగా, సమీపంలోని లాలు తండా ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్పందించిన అటవీశాఖ అధికారులు మంటలను ఆర్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
ADB: గుడిహత్నూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ శనివారం హాజరయ్యారు. ఈ సందర్భంగా మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 51 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
MDK: రామాయంపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద శనివారం ఇసుక బహిరంగ వేలం పాట నిర్వహించారు. ఇటీవల స్వాధీనం చేసుకున్న 16 ట్రాక్టర్ల ఇసుక బహిరంగ వేలం పాట నిర్వహించగా 8 మంది వ్యాపారులు ఈ వేలంపాటలో పాల్గొన్నారు. రూ.43 వేలకు స్థానిక ఇసుక వ్యాపారి మల్లారెడ్డి ఇసుకను స్వాధీనం చేసుకున్నట్లు డిప్యూటీ తహసీల్దార్ నవీన్ కుమార్ తెలిపారు.
GDWL: గద్వాల మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ (MALD) డిగ్రీ కళాశాలలో శనివారం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వైస్ ప్రిన్సిపాల్ డా. కె. చంద్రమోహన్ అధ్యక్షతన సర్ సీవీ రామన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించి, ఆయన విజ్ఞాన రంగంలో చేసిన కృషిని స్మరించుకున్నారు. సైన్స్ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
GDWL: అలంపూర్ నుంచి హైదరాబాద్కు న్యాయవాదులు తలపెట్టినా మహా పాదయాత్ర నేటితో ముగిసిందని ఆలంపూర్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నరసింహ అన్నారు. మహా పాదయాత్రతో సెక్రటేరియట్కు చేరుకున్న న్యాయవాదులు అనంతరం సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రతి చోటా న్యాయవాదులపై దాడులు జరుగుతున్నాయని నరసింహ పేర్కొన్నారు.
RR: జాతీయ విజ్ఞాన దినోత్సవం సందర్భంగా చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని పామెన శివారులో ఉన్న ఓ పాఠశాలలో వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు రూపొందించిన వివిధ శాస్త్రీయ నమూనాలు, ప్రయోగాలు, సైన్స్ ప్రాజెక్టులను ప్రదర్శించారు. పునరుత్పాదక శక్తి వనరులు, పర్యావరణ పరిరక్షణ, స్మార్ట్ సిటీ నమూనాలు, సైన్స్ ఆధారిత ఆవిష్కరణలు సందర్శకులను ఆకట్టుకున్నాయి.
MBNR: బాలానగర్ మండలం నందారంలో నిర్మిస్తున్న మల్లన్న స్వామి ఆలయానికి చెన్నారెడ్డి అనే భక్తుడు రూ.51,116 విరాళంగా అందజేశారు. హిందూ సంప్రదాయాల పరిరక్షణకు ఆలయాల అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు. ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
JGL: ధర్మపురి నియోజకవర్గంలోని కిష్టంపేట గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో నూతన అంగన్వాడీ కేంద్ర భవన నిర్మాణానికి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ చేతుల మీదుగా భూమిపూజ జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ సీడీపీవో మమత, ఎంపీడీవో చిరంజీవి, ఎంపీ ఓ సుష్మ, ఏఈ ప్రసాద్, గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
జగిత్యాల రూరల్ మండలం తక్కలపల్లిలో శ్రీ రేణుకా ఎల్లమ్మ గౌడ సంఘం ఆధ్వర్యంలో ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన, బోనాల పండుగ, పట్నాల మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. గౌడ సంఘం సభ్యులు, గ్రామ నాయకులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. మహిళలు బోనాలు సమర్పించారు.
HYD: రేంజ్ మారిపోతోంది బాబోయ్! 765 చదరపు కిలోమీటర్ల భారీ విస్తీర్ణంలో రూపుదిద్దుకుంటున్న ‘ఫ్యూచర్ సిటీʼకి సర్కార్ డెడ్ లైన్ ఫిక్స్ చేసింది. కేవలం 9 నెలల్లోనే పూర్తిస్థాయి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని టెండర్లో స్పష్టం చేసింది. 56 గ్రామాలను కలుపుతూ గ్లోబల్ కంపెనీలు, యూనివర్సిటీలే లక్ష్యంగా ఈ నగరం నిర్మిస్తున్నారు.
SDPT: కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటుందని ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. జనగామలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఫూట్ బాల్ ఆడటానికి, విలాసవంతమైన కార్యాలయం కట్టుకోవడానికి పైసలు ఉంటాయి కానీ, రైతులకు రైతుబంధు ఇవ్వడానికి డబ్బులు లేవా అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.
NGKL: ఏఐసీసీ కార్యదర్శి, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డి రాజ్యసభ సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. జాతీయ స్థాయిలో పార్టీకి అందిస్తున్న సేవలను గుర్తించి ఆయనకు అవకాశం ఇవ్వాలని పలువురు నేతలు సీఎం రేవంత్ రెడ్డిపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. త్వరలో రాష్ట్రం నుంచి రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
ఖమ్మం జిల్లాలో ఉన్న గిరిజన అభివృద్ధి శాఖ (ఏటీడీవో) కార్యాలయాలను తక్షణమే కలెక్టరేట్ కార్యాలయంలోకి మార్చాలని PDSU జిల్లా అధ్యక్షులు గోకినపల్లి మస్తాన్ డిమాండ్ చేశారు. ఈమేరకు శనివారం ఆ శాఖ డిడి విజయలక్ష్మికి వినతి పత్రం అందజేశారు. జిల్లాలో 30 వసతిగృహాలు ఉండగా, ఏటీడీవోలు హాస్టళ్లను సందర్శించకుండా కేవలం కార్యాలయాలకే పరిమితమవుతున్నారని వివరించారు.
BDK: అశ్వాపురం మండలం, ఆనందపురం గ్రామంలో గిరిజనులకు చెందిన 4 ఎకరాల భూమి ఆక్రమణకు గురైందని సర్పంచ్ ముర్రం సమ్మయ్య ఆరోపించారు. భూములపై ప్రశ్నించినందుకు తమపై కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారని తెలిపారు. రెవిన్యూ అధికారులు వెంటనే స్పందించి భూములను తిరిగి అప్పగించాలని డిమాండ్ చేశారు. అవసరమైతే ఉన్నతాధికారులను కలిసి న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు.
HNK: పరకాల మున్సిపాలిటీ 20వ వార్డుకు చెందిన జీత్ కౌర్ ఇటీవల మరణించగా నేడు వారి కుటుంబ సభ్యులను బీజేపీ పరకాల పట్టణ కార్యదర్శి పాలకుర్తి తిరుపతి పరామర్శించి బియ్యం అందజేశారు. 20వ వార్డు పరిధిలోని ప్రజలకు అనునిత్యం అండగా ఉంటూ.. వారి సమస్యల పరిష్కారమే ప్రార్థన లక్ష్యంగా పనిచేస్తానని తిరుపతి తెలిపారు