KMM: చింతకాయ మండలం కోయచలక గ్రామానికి చెందిన పసుపులేటి కవిత వారి కుటుంబ సభ్యులు దైవ దర్శనానికి వెళ్లి ఇంటికి వస్తున్న క్రమంలో దిలీప్ & శ్యామ్ కొంతమంది వ్యక్తులు కలిసి తాగిన మైకంలో వారి కారు వెంబడిస్తూ వారిని బూతులు తిట్టుకుంటూ మహిళలపై దౌర్జన్యం చేశారు. వీరిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి సోమవారం కోర్టుకు రిమాండ్ చేసినట్లు ఎస్సై జితేందర్ తెలిపారు.
ADB: ఆదివాసీల హక్కులు, ఆత్మగౌరవం కోసం ఉద్యమించిన అలుపెరుగని పోరాట వీరుడు కొమరం భీమ్. ఉమ్మడి అదిలాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని మారుమూల గ్రామమైన జోడేఘాట్ గ్రామంలో ఈయన జన్మించారు. జల్ జంగల్ జమీన్ అనే నినాదంతో నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన నాయకుడు కొమరం భీమ్. అందుకే ఆయన్ను ఆదివాసీలు ఆరాధ్య దైవంగా కొలుస్తారు.
JN: జనగామ జిల్లా కొడకండ్ల మండలం చెరువు ముందు తండాలో ధరావత్ రేఖ్య నాయక్ (65) అనే వృద్ధుడు సోమవారం రాత్రి ఉరి వేసుకుని మృతిచెందాడు. అట్టి వృద్ధుడు కిడ్నీ సమస్యతో కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని, కిడ్నీ నొప్పి భరించలేక ఉరి వేసుకున్నట్టు స్థానికులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
NLG: విద్యార్థులు పాఠశాల స్థాయిలోనే లక్ష్యాలను ఏర్పచుకుని పట్టుదల,క్రమశిక్షణతో విద్యనభ్యసించాలని ఇంపాక్ట్ మోటివేషనల్ ట్రైనర్ దెందె ప్రవీణ్ కుమార్ అన్నారు. సోమవారం కట్టంగూర్ ఉన్నత పాఠశాలలో లయన్స్ క్లబ్ అఫ్ కట్టంగూర్ కింగ్స్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన యువ వికాస్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు నిత్య సాధనతో మంచి ఫలితాలు సాధించవచ్చని పేర్కొన్నారు.
BDK: బీటీపీఎస్ నుంచి మణుగూరుకి వెళ్లే 12 కిలోమీటర్ల రహదారిపై ఏర్పడిన పెద్ద గుంతలతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ గోతుల్లో ప్రయాణం ప్రమాదకరంగా మారిందని మంగళవారం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు లారీల దుమ్ము, మరోవైపు పెద్ద పెద్ద గుంతలతో వాహనదారుల పరిస్థితి వర్ణనాతీతంగా ఉందని వాపోయారు. సంబంధిత అధికారులు స్పందించాలని ప్రయాణికులు కోరారు.
ASF: నేడు వీరయోధుడు కొమరం భీం వర్ధంతి. ఆదివాసీల హక్కుల కోసం బ్రిటిష్, నిజాం పాలనలపై పోరాడిన వీరుడు. “జల, జంగల్, జమీన్” అనే నినాదంతో గిరిజనుల హక్కులను కాపాడేందుకు ఆయన ఉద్యమం నడిపారు. 1940లో నిజాం సేనల చేతులలో అమరుడైన భీం స్మృతి ప్రాంగణాల్లో నివాళులు అర్పిస్తూ ఆదివాసీ సంఘాలు, ప్రజాసంఘాలు సంస్మరిస్తున్నాయి. ఆయన త్యాగాలు కొత్త తరానికి స్ఫూర్తిదాయకం.
MBNR: జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం సోమవారం నిర్వహించారు. జిల్లా ఎస్పీ డీ. జానకి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన పౌరులను కలిశారు. ఈ సందర్భంగా మొత్తం 10 వినతి పత్రాలు స్వీకరించారు. ప్రతి పిర్యాదులను శ్రద్ధగా విన్న ఎస్పీ సంబంధిత విభాగాల అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
MDK: శ్రీ ఏడుపాయలలోని రాజగోపురం వద్ద దుర్గా భవాని మాతకు మంగళవారం ప్రధాన అర్చకులు శంకర్ శర్మ భౌమ వాసరే ప్రత్యేక పూజలు నిర్వహించారు. అశ్వయుజ మాసం శుక్లపక్షం పౌర్ణమి తిథి పురస్కరించుకొని అమ్మవారికి పంచామృతాలు పవిత్ర గంగాజలంతో అభిషేకం చేశారు. అనంతరం మంగళహారతి నీరాజనం చేసి భక్తులకు దర్శనం కల్పించారు.
NGKL: అచ్చంపేట మండలం కన్యతాండ చెందిన 10 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సోమవారం బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బాలరాజు వారికి కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనతో రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని, ఎన్నికలు ఎప్పుడూ వచ్చినా బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు.
VKB: భారీ వర్షాలతో నివాస ప్రాంతాలను కోల్పోయిన ప్రజలకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేస్తుందని కుల్కచర్ల ఎంపీడీవో రామక్రిష్ణ తెలిపారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నిలువ నీడ లేకుండా సర్వం కోల్పోయిన ప్రజలకు ప్రభుత్వం అండగా ఉండి ఆర్థిక సాయం అందజేస్తుందని తెలిపారు.
MDK: పాపన్నపేట మండలం శ్రీ ఏడుపాయలలో వనదుర్గమ్మ ఆలయం ఎదుట మంగళవారం వరద ఉధృతి కొనసాగుతోంది. గత రెండు రోజుల నుంచి వరద తగ్గినప్పటికీ, మళ్లీ సింగూర్ ద్వారా మూడు గేట్లు ఓపెన్ చేసి దిగువకు వదలడంతో, వరద ప్రవాహం స్వల్పంగా పెరుగుతోంది. అటువైపు ఎవరిని వెళ్లకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు.
PDPL: సింగరేణి ఆర్జే 1 సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించనున్న వివిధ వృత్తి శిక్షణా తరగతులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. దరఖాస్తు ఫారాల కోసం ఆర్టీ 1పరిధిలోని గనుల కార్యాలయాల్లో సంప్రదించాలని సూచించింది. ఈ నెల 15 లోగా దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు.
SRD: ఝరాసంగం మండలం ఎల్గోయి BRS పార్టీ సీనియర్ నాయకులు మాజీ CDC ఛైర్మన్ ఉమాకాంత్ పటేల్ గత కొద్దిరోజులుగా కాలు ఫ్రాక్చర్ అయి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఆలిండియా వీరశైవ లింగాయత్ జనరల్ సెక్రెటరీ వినయ నాగేష్ పటేల్ బసవరాజ్ పటేల్, మంజుల పాటిల్, శైలజ పాటిల్, విశ్వనాథ్ పాటిల్, కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం హాస్పిటల్కి వెళ్లి ఆయనకు పరామర్శించారు.
NLG: అక్టోబర్ 9న హజరత్ సయ్యద్ లతీఫ్ షావలి దర్గాలో జరగనున్న ఉరుసు-ఎ-షరీఫ్ ఏర్పాట్లపై డీఎస్పీ శివరాంరెడ్డి సోమవారం సమీక్షించారు. ఉరుసు కమిటీ సభ్యులు, దర్గా ఇనాంధారులతో ఆయన చర్చించారు. ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో నిర్వహించాలని ఆదేశించిన డీఎస్పీ, పోలీస్ శాఖ నుంచి అన్ని రకాల సహకారాలు అందిస్తామని తెలిపారు.
ADB: జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయి. ఆయా కాలనీల్లో ఏర్పాటు చేసిన బతుకమ్మల వద్ద రాత్రి వేళల్లో మహిళలు, యువతులు ఆడుతూ పాడుతూ సందడి చేస్తున్నారు. పౌర్ణమి రోజు పాలల్లో చందమామను చూసే పద్ధతిని వీరు అనుసరిస్తారు. ఇందులో భాగంగా సోమవారం అర్థరాత్రి 12 గంటల ప్రాంతంలో ఆయా కాలనీల్లో బతుకమ్మల వద్ద మధ్యలో పాలను ఉంచి అందులో చందమామ చూశారు.