KMM: కూసుమంచి మండలం మామిడి తోటల్లో సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని పాలేరు ఉద్యాన అధికారి పి.అపర్ణ తెలిపారు. మార్చి మాసంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆమె వివరించారు. ప్రస్తుతం కాయలు బఠానీ గింజ పరిమాణంలో ఉన్నాయని, ఈ సమయంలో నల్లమచ్చ తెగులు సోకే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.
PDPL: యువతకు శిక్షణ అందించి, ఉపాధి అవకాశాలు పెంచేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. ఇవాళ ఆయన మంథనిలోని టాస్క్ సెంటర్ను సందర్శించారు. అవసరమైన పక్షంలో మరో భవనం నిర్మించాలన్నారు. 99 రోజుల కార్యాచరణలో భాగంగా TGIIC ఆధ్వర్యంలో గార్మెంట్ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు 2 ఎకరాల స్థలం కేటాయించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
NZB: చందూర్ మండలం వకీల్ ఫారం వద్ద బుధవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు వివరాల ప్రకారం వర్ని మండలం శంకొరా గ్రామానికి చెందిన గోపాల్ వకీల్ ఫారం వద్ద బైక్పై నుంచి పడ్డాడు. దీంతో అతని నాలుక తెగి తీవ్ర గాయాలు అయ్యాయి. చందూర్ 108 సిబ్బంది ఈఎంటీ రవి, పైలట్ వినోద్ ప్రథమ చికిత్స చేసి జిల్లా ఆసుపత్రికి తరలించారు.
RR: మహేశ్వరం నియోజకవర్గం పహాడీ షరీఫ్ దర్గాలోని ఈద్గాలో పనుల కొరకు నిధులు మంజూరు చేయాలని, పహాడీ షరీఫ్ డివిజన్, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ చంద్రకళకు పహాడి షరీఫ్ మాజీ కౌన్సిలర్ కొండల్ యాదవ్ వినతి పత్రం అందజేశారు. అందుకు ఆమె సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
VKB: విద్యార్థినులు లైంగిక వేధింపులకు గురైతే భయపడకుండా ఫిర్యాదు చేయాలని పరిగి షీ టీమ్ ఇంఛార్జ్ నర్సింలు సూచించారు. బుధవారం పరిగి పట్టణంలోని న్యూ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 నంబరుకు కాల్ చేయాలని ఆయన కోరారు.
RR: శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని పలు డివిజన్లకు చెందిన 40 మంది లబ్ధిదారులకు రూ. 40,04,640 విలువైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను PAC ఛైర్మన్ ఆరెకపూడి గాంధీ పంపిణీ చేశారు. మియాపూర్లోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ శ్రీకాంత్, సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డిలతో కలిసి ఆయన లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.
SDPT: అక్కన్నపేట మండలం రామవరం గ్రామంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో పదవ వార్డులో ప్రజలకు నీటి ఇబ్బందుల దృష్ట్యా ఇవాళ నూతన మోటార్ను బిగించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రజలకి ఇబ్బంది లేకుండా నీటి సౌకర్యాన్ని కల్పించాం. అలాగే గ్రామంలోని ప్రతి సమస్య తీరుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు, గ్రామపంచాయతీ కార్యదర్శి, గ్రామస్తులు పాల్గొన్నారు.
MLG: వెంకటాపూర్ (రామప్ప) మండలం వెళ్తుర్లపల్లి గ్రామంలో నూతన గ్రామపంచాయితీ నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం సర్పంచ్ బొజ్జ శారద జగన్ మోహన్ రావు నిర్వహించగా, తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ డైరెక్టర్ బైరెడ్డి భగవాన్ రెడ్డి హాజరై ప్రారంభించారు. అనంతరం అధికారులు, సర్పంచ్, వార్డు మెంబర్లు పంచాయతీరాజ్ డైరెక్టర్ ని శాలువాతో సన్మానించారు.
నాగర్కర్నూల్ జిల్లాలో వేపచెట్లను కీటకాలు, శిలీంద్రాలు తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఆకులు రంగుమారి రాలిపోతూ, కొమ్మలు ఎండిపోతున్నాయి. పూత, కాయలు రావడం నిలిచిపోయి, చెట్లు మొత్తం ఎండిపోతున్నాయి. నిపుణులు ప్రతికూల వాతావరణ కారణంగా తెగులు వ్యాప్తి చెందుతున్నాయని, వాటిని కాపాడేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
KMM: ముదిగొండలోని రైతు వేదికలో నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యుల శిక్షణా తరగతులు బుధవారం ప్రారంభమయ్యాయి. మండలంలోని 126 మంది వార్డు సభ్యులకు ఐదు రోజుల పాటు ఈ శిక్షణ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా ఎంపీడీవో శ్రీదేవి మాట్లాడుతూ.. గ్రామాల సమగ్ర అభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. గ్రామాల్లో సమస్యలను సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని సూచించారు.
BDK: సుజాతనగర్ మండలం వేపలగడ్డ మహాత్మా గాంధీ జ్యోతిరావు ఫూలే బీసీ వెల్ఫేర్ హాస్టల్ని బుధవారం జిల్లా కలెక్టర్ అంకిత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్లోని వంటశాల, విద్యార్థుల తరగతి గదులను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలన్నారు.
KNR: జిల్లా కోర్టు ప్రాంగణంలో జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. న్యాయవాదులు, న్యాయ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని, ఒకరికొకరు రంగులు పూసుకున్నారు. పరస్పర స్నేహభావం, ఐక్యతకు ప్రతీకగా హోలీ వేడుకలను నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పెద్దలు, చిన్నారులకు హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు.
ASF: బెజ్జుర్ మండలం సలుగుపెల్లి X రోడ్డు వద్ద SI సర్తాజ్ పాషా ఆధ్వర్యంలో బుధవారం డ్రంక్ అండ్ డ్రైవ్, వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారుల పత్రాలను పరిశీలించి, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, ప్రతి ఒక్కరూ సరైన ధృవీకరణ పత్రాలు కలిగి ఉండాలని ఎస్ఐ సూచించారు.
SRD: యుద్ధ ప్రాతిపదికన సింగూరు డ్యామ్ సేఫ్టీ పనులను పూర్తి చేయాలనీ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులకు ఆదేశించారు. బుధవారం సహచర మంత్రి ఉత్తంకుమార్ రెడ్డితో కలిసి సింగూర్ డామ్ పై సమీక్షించారు. సింగూరు ప్రాజెక్టు సుందరీకరణ పనులు వేగంగా పూర్తి చేసి జులై నెలాఖరులోగా రైతులకు సాగునీరు అందించాలన్నారు.
HNK: టీజీఎన్పీడీసీఎల్ హనుమకొండ సర్కిల్లో లైన్ మెన్ దివస్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సూపరింటెండింగ్ ఇంజినీర్ పి.మధుసూదన్ రావు అమరవీరుల స్తూపం వద్ద శాఖాధికారులు, సిబ్బందితో కలిసి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ ఇంజినీర్లు ఏ.విజయేందర్ రెడ్డి, జి.సాంబారెడ్డి, పి.మల్లికార్జున్ తదితర అధికారులు పాల్గొన్నారు.