KMR: జిల్లాలో సోమవారం కురిసిన వర్షానికి పలు గ్రామాల్లోని చెరువుల అలుగులు ఉప్పొంగాయి. పిట్లం మండలం తిమ్మనగర్ వద్ద కాకివాగు, నల్లవాగులు పొంగిపొర్లడంతో వరద తీవ్రత పెరిగింది. ఈ వరదలో పెద్ద కొడఫ్గల్ మండలం పోచారం తండాకు చెందిన రైతు ఫక్రే సైమల్ చిక్కుకుపోయాడు. సమాచారం అందుకున్న సహాయక బృందాలు వెంటనే రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు.