హాంకాంగ్ సిక్సర్స్ టోర్నీలో భాగంగా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. ఉత్తప్ప(28), చిప్లి(24), కార్తీక్(17) రాణించడంతో నిర్ణీత 6 ఓవర్లలో 86 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో పాక్ 3 ఓవర్లు ముగిసేసరికి 41/1 పరుగుల వద్ద ఉండగా, వర్షం అంతరాయం కలిగించింది. దీంతో D/L పద్ధతిలో భారత్ 2 పరుగుల తేడాతో విజయం సాధించింది.