MDCL: అల్వాల్ సర్కిల్ పరిధి కనజిగూడలోని మరకత శ్రీలక్ష్మీ గణపతి దేవస్థానంలో బుధవారం స్వామివారికి ఆలయ వ్యవస్థాపకులు డాక్టర్ మోత్కూరు సత్యనారాయణ శాస్త్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏప్రిల్ 5 నుంచి 7 వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రత్యేక హోమాల్లో పాల్గొనదలచిన భక్తులు గోత్రనామాలతో ఆలయ కార్యాలయంలో నమోదు చేసుకోవాలన్నారు.
NRML: బాసర IIITలో విద్యార్థులను పోలీసులు దూషించారనే వార్తలను జిల్లా పోలీసులు ఖండించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో వాయిస్ మార్ఫింగ్ చేశారని, అది పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. ప్రజలు, విద్యార్థులు ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి వీడియోలు సృష్టించారని పోలీస్ శాఖ క్లారిటీ ఇచ్చింది.
MDK: జిల్లా ఓటర్ల జాబితా సవరణలో భాగంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో రాజకీయ పార్టీల నాయకులు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణలో ఎలాంటి పొరపాట్లు చోటు చేసుకోకుండా మ్యాపింగ్ ప్రక్రియను సమగ్రంగా నిర్వహించాలన్నారు.
WNP: ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన రుణ ప్రణాళికలో భాగంగా మార్చి 31లోపు 100% పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి బ్యాంకర్లను ఆదేశించారు. బుధవారం వనపర్తి కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. బీమా చేయించే బాధ్యతను బ్యాంకర్లు తీసుకోవాలని ఆదేశించారు.
SRD: కంగ్టి మండలం బాన్సువాడ గ్రామానికి చెందిన యువకులకు సర్పంచ్ సౌజన్య మణిక్ రెడ్డి క్రికెట్ కిట్టును అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. యువకులు క్రీడల్లో రాణించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి సుధీర్, ఉప సర్పంచ్ గోవిందరావు పాటిల్, నాగభూషణం, మోహన్, గంగారం, అఖిల్, గంగాధర్ ఉమాకాంత్ ఉన్నారు.
BHPL: తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా BHPL జిల్లా ప్రజలందరికీ జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.. సమాజంలో సౌభ్రాతృత్వం, ఐక్యత మరింత బలపడాలని, జిల్లా అభివృద్ధికి అందరూ భాగస్వాములు కావాలని కోరారు. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని వేడుకలు నిర్వహించాలని కలెక్టర్ కోరారు.
MBNR: SFI విద్యార్థుల సమస్యలపై అలుపెరుగని పోరాటం చేసి ఎన్నో విజయాలు సాధించిందని ఉపకులపతి శ్రీనివాస్ పేర్కొన్నారు. బుధవారం వర్సిటీలోని అకాడమిక్ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరై మాట్లాడారు. విద్యార్థులకు అన్యాయం జరిగితే వెంటనే పోరాటం చేశారని గుర్తు చేశారు. విద్యార్థికి అన్యాయం జరగకూడదు అనే నిబంధనతో విద్యార్థి సంఘం పనిచేస్తున్నారన్నారు.
ASF: కాగజ్ నగర్ మండలంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గి వాతావరణం చల్లబడింది. తెలంగాణ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ నివేదిక ప్రకారం ఇక్కడ గరిష్టంగా 35.6 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఇటీవల కురిసిన స్వల్ప వర్షాల ప్రభావంతో ఎండ తీవ్రత తగ్గిందని , రాబోయే రోజుల్లో మళ్లీ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.
KMM: ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూములపై యధాస్థితి (స్టేటస్ కో) కొనసాగించాలని ఖమ్మం కలెక్టర్, ఆర్డీవో, తాహసీల్దార్లకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అసలైన లబ్ధిదారులను గుర్తించి, ఇళ్లు కోల్పోయిన ప్రతి ఒక్కరికీ భూదాన్ భూముల్లో ఇళ్ల స్థలం, ఇల్లు మంజూరు చేయాలని కోర్టు స్పష్టం చేసింది. బాధితులు హైకోర్టును ఆశ్రయించగా బుధవారం ఈ ఆదేశాలు వెలువడ్డాయి.
JGL: కోరుట్ల పట్టణానికి చెందిన యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో నిందితుడైన భర్తను కోరుట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రెస్మిట్లో మెట్పల్లి డీఎస్పీ రాములు మాట్లాడుతూ.. మాధాపూర్ గ్రామానికి చెందిన గంధం దుర్గాప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన కుమార్తె చిత్తారి, గంధం వైష్ణవి (20)ను ఆమె భర్త చిత్తారి హరిబాబును అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
BHNG: తుర్కపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో పదవతరగతి పరీక్షా కేంద్రాలను కలెక్టర్ అనురాగ్ జయంతి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల హాజరు, గైర్హాజరు వివరాలను సంబంధిత పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటిండెంట్లను అడిగి తెలుసుకున్నారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద త్రాగునీరు ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులను ప్రధాన గేట్ వద్ద పూర్తి స్థాయిలో తనిఖీ చేయాలన్నారు
SRCL: ముస్తాబాద్ మండలంలోని మొర్రాపూర్ గ్రామంలో సైకిల్పై వెళ్తున్న బాలుడిని ట్రాక్టర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పాఠశాల నుంచి ఇంటికి వచ్చి సైకిల్పై వెళ్తున్న భూక్యా ఇషాన్ అనే బాలుడిని కంకర లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. దీంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఇషాన్ మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
SRPT: తెలంగాణ సాయుధ పోరాట వీరనారి మల్లు స్వరాజ్యం జీవితం స్ఫూర్తిదాయకమని సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. బుధవారం సూర్యాపేటలో నిర్వహించిన మల్లు స్వరాజ్యం వర్ధంతి సభలో పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. తుపాకీ పట్టి నిజాంను గడగడలాడించిన వీరవనిత మల్లు స్వరాజ్యం అన్నారు.
NLG: నల్గొండ మున్సిపల్ అధికారుల పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు తెరలేపారు. ప్రాపర్టీ టాక్స్, ట్రేడ్ లైసెన్స్ ఫీజులు చెల్లించాలని ఫోన్లు చేస్తూ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలని కోరుతున్నారు. ఇటీవల ఓ ఆసుపత్రికి ఇలాగే ఫోన్ రాగా, యాజమాన్యం అధికారులను సంప్రదించడంతో ఈ మోసం బయటపడింది. దీంతో అప్రమత్తమైన అధికారులు లింకులు, స్కానర్ల ద్వారా డబ్బులు చెల్లించవద్దని ప్రజలకు సూచన చేశారు.
WGL: రాష్ట్ర బడ్జెట్లో ఓరుగల్లుకు ప్రత్యేక నిధులు కేటాయించి ప్రాధాన్యతను ఇవ్వాలని CPI రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కల్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. శివనగర్లో వరంగల్ CPI జిల్లా సమితి సమావేశంలో ఆయన మాట్లాడుతూ… గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో వరంగల్ అభివృద్ధికి ఆమడ దూరంగా నిలిచిపోయిందని, బడ్జెట్లో ఓరుగల్లుకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలన్నారు.