HYD: మే 4వ తేదీ నుంచి హజ్ యాత్ర ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో రాష్ట్ర హజ్ కమిటీ ఛైర్మన్ విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. మే 4 నుంచి మే 21 వరకు యాత్ర కొనసాగనుంది. రాష్ట్రం నుంచి మొత్తం 11,757 మంది దరఖాస్తు చేసుకోగా, ప్రస్తుతానికి 9,500 మందికి అనుమతి లభించినట్లు అధికారులు వెల్లడించారు.
WGL: 2022-23 బ్యాచ్కు చెందిన శరదృతి, ముత్తినేని అంకిత 2025 నీట్లో ఉత్తమ ర్యాంకులు సాధించి ఎంబీబీఎస్ సీట్లు పొందారు. శరదృతి కాకతీయ మెడికల్ కాలేజీ, అంకిత ఆదిలాబాద్ రిమ్స్లో ప్రవేశం పొందారు. ఈ మేరకు ఇవాళ పాఠశాల డైరెక్టర్ జావేద్ విద్యార్థులను సన్మానించి అభినందించారు. విద్యార్థులు పట్టుదలతో, క్రమశిక్షణతో విద్యలో రాణించినట్లు ఉపాధ్యాయులు తెలిపారు.
MHBD: తొర్రూరు మండలంలోని పలు గ్రామాల్లో పేరుకు మాత్రమే కిరాణా దుకాణాలు నిర్వహిస్తూ.. లోపల మాత్రం దర్జాగా మద్యం వ్యాపారం కొనసాగిస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి దాకా షాపులు తెరిచి ఉండడంతో మద్యం తాగి యువకులు, పెద్దలు గొడవలకు దిగుతున్నారు. దీనిని అరికట్టాల్సిన సంబంధిత అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
NLG: కేతపల్లి మండలం కొండకింది గూడెం గ్రామంలో జేసీబీలతో అక్రమంగా మట్టి తవ్వి టిప్పర్ల ద్వారా నకిరేకల్ ప్రాంతానికి తరలిస్తూ దళారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ కొనసాగుతోంది. దీనిని అడ్డుకున్న స్థానికులపై దాడులకు దిగుతున్నారని ఆరోపిస్తున్నారు. రెవెన్యూ, పోలీసుశాఖ అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
KMM: సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు మార్చి 23 దేశవ్యాప్తంగా జాతీయోద్యమ అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమాని విజయవంతం చేయాలని రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల సంయుక్త సమావేశంలో నాయకులు ఇవాళ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వలసవాద ధోరణిని మార్చుకోవాలని అన్నారు. ఈ నెల 23న జరగనున్న కార్యక్రమంలో వ్యవసాయ కార్మికులు భాగస్వామ్యం కావాలని కోరారు.
BHNG: భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి చిన్నాన్న సుధాకర్ రెడ్డి అనారోగ్యంతో గురువారం సాయంత్రం మరణించారు. శుక్రవారం వలిగొండ పట్టణంలో ఆయన పార్థివ దేహానికి పూల మాల వేసి నివాళులు అర్పించి అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని దుఃఖ సంద్రంలో మునిగారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నరు.
JN: క్షయ వ్యాధి నిర్మూలనకు విస్తృత చర్యలు చేపట్టాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. ఈ నెల 24న ప్రపంచ క్షయ దినోత్సవం సందర్భంగా ఇవాళ కలెక్టరేట్లో సంబధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. వ్యాధి నిర్మూలన విషయంలో ప్రజలకు విస్తృతంగా అవగాహన పరచాలని సూచించారు.
ములుగు జిల్లాలో పామాయిల్ సాగు పెంపు కోసం రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తామని జిల్లా ఆత్మ ఛైర్మన్ రవీందర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రాలోని రైతు వేదికలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 100 శాతం రాయితీపై కూరగాయ విత్తనాలు, ఆక్వా యూనిట్లకు ఎస్సీ, ఎస్టీలకు 60%, ఇతరులకు 40% సబ్సిడీ ఇస్తామని చెప్పారు. త్వరలో కిసాన్ మేళా నిర్వహిస్తామని పేర్కొన్నారు.
ADB: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ లోన లొటారం, పైన పటారంగా ఉందని MLA పాయల్ శంకర్ అన్నారు. రైతు భరోసా నిధులకు సరైన కేటాయింపులు లేకుండా ఈ బడ్జెట్ను ఎలా ప్రవేశపెట్టారని విమర్శించారు. ఉద్యోగులు తమ కష్టపడి జమ చేసుకున్న డబ్బులను కూడా తిరిగి ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా లేకపోవడం వారి నిరంకుశ వైఖరికి నిదర్శనం అని MLA పేర్కొన్నారు.
మహబూబ్ నగర్లోని ఎంవీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం సైన్స్, కంప్యూటర్స్ విద్యార్థులకు 3, 5 వ సెమిస్టర్ ప్రయోగ పరీక్షలు ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు హాల్ టికెట్, ఐడెంటి కార్డు, ఫీజు చెల్లించిన రసీదులు తీసుకురావాలని రీజినల్ కోఆర్డినేటర్ డాక్టర్ సత్యనారాయణ గౌడ్ తెలిపారు.
KNR: జిల్లా కేంద్రంలో ఇవాళ భగవతి పాఠశాలలు, సమైక్య సాహితి ఆధ్వర్యంలో సాహిత్య కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డా. డింగరి నరహరి ఆచార్య రచించిన ‘మథనం’, ‘ఉజ్జీవనం’ పుస్తకాలను డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు ఆవిష్కరించారు. అనంతరం, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా బాధ్యతలు స్వీకరించిన యాదగిరి సునీల్ రావును భగవతి పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు ఘనంగా సత్కరించారు.
SRCL: మహిళ మెడలో నుంచి పుస్తెలతాడు లాక్కెళ్ళిన దొంగలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని సిరిసిల్ల సీఐ శ్రీనివాస్ తెలిపారు. సిరిసిల్లలోని సాయి నగర్లో మార్చి 17, 2026న మెరుగు లత తన ఇంటి నుంచి బయటకు రాగా సయ్యద్ మౌలానా, మంగురు ప్రకాష్ యాదవ్ అడ్రస్ అడుగుతున్నట్లు నటించి బాధితురాలి పుస్తెలతాడు తెంపుకెళ్లినట్లు పేర్కొన్నారు.
JGL: పర్యావరణ పరిరక్షణతోనే గ్రామానికి పచ్చని భవిష్యత్తు ఉంటుందని రాయికల్ మండలం ఇటిక్యాల యువత నిరూపించారు. గ్రామంలో నిర్మిస్తున్న గంగాదేవి ఆలయానికి ఓ యూత్ సభ్యులు తమ సామాజిక బాధ్యతగా రూ.12,222 ఆర్థిక సాయం అందజేశారు. ఈ నిధులతో ఆలయ ప్రాంగణంలో పచ్చదనం వెల్లివిరిసేలా మొక్కలు నాటాలని వారు నిర్ణయించారు.
RR: ప్రజల అవసరాలే మా మొదటి ప్రాధాన్యత అని నందిగామ మండలం చేగూరు సర్పంచ్ శ్రీశైలం అన్నారు. గ్రామంలోని 4,5,8 వార్డుల్లో శాశ్వత బోర్లను ప్రారంభించారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు వార్డుల్లో నెలకొన్న తీవ్ర నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకొని బోర్లను వేయించడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను పరిష్కరించే నాయకుడు గ్రామానికి ఎంతో అవసరమని అన్నారు.
MDCL: అల్వాల్ పట్టణ పరిధి టెంపుల్ అల్వాల్ హరిదాస మండపంలో 75వ శ్రీ సీతారామ వసంత నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం శ్రీ సీతాష్టోత్తర శతనామ కుంకుమార్చనను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారికి ప్రత్యేక అర్చనలు, పూజలు చేశారు. శనివారం సాయంత్రం పద్మశ్రీ అవార్డు గ్రహీత బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు ప్రవచనం ఉంటుందని తెలిపారు.