తెలంగాణ హైకోర్టును బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ నేత చెరుకు సుధాకర్ ఆశ్రయించారు. తమ ప్రాణానికి హనీ ఉందని.. రక్షణ కల్పించేలా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
మార్గదర్శి చిట్ ఫండ్ అక్రమాలు, నిధుల మళ్లింపు కేసులో తెలంగాణ హైకోర్టు ఏపీ సీఐడీకి కీలక ఆదేశాలు జారీచేసింది. మార్గదర్శికి చెందిన 30 మంది మేనేజర్లపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టంచేసింది.
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు(Dil Raju) రాజకీయాల్లోకి వస్తాడని(political entry) పుకార్లు వచ్చిన నేపథ్యంలో వాటిపై ఆయన తాజాగా స్పందించారు. ప్రస్తుతానికైతే రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని దిల్ రాజు స్పష్టం చేశారు.
వైఎస్ వివేకా హత్య కేసులో ఈ రోజు కీలక పరిణామం చోటుచేసుకుంది. వైఎస్ భాస్కర్ రెడ్డి మరో పిటిషన్ వేశారు. వివేకా హత్య కేసులో ఏ-4గా ఉన్న దస్తగిరిని సీబీఐ అఫ్రూవర్గా ప్రకటించడాన్ని సవాల్ చేశాడు.
Sabhita Indra Reddy : ప్రస్తుతం తెలంగాణలో పదో తరగతి పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా... ఈ పరీక్షలకు సంబంధించి పేపర్ లీక్ అయ్యాయంటూ వార్తలు వస్తున్నాయి. నిన్న తెలుగు పేపర్, హిందీ పేపర్ లు లీక్ అయ్యాయంటూ వార్తలు వచ్చాయి. కాగా... దీనిపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరా తీశారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వైఎస్ షర్మిల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. బీజేపీకి బీ టీమ్లో వైసీపీ పనిచేస్తుందని షర్మిలతో వీరభద్రం అనగా.. అదేం లేదని ఆమె చెప్పారు.
ఈరోజు వరంగల్ జిల్లాలో హిందీ పేపర్ లీక్ ఘటనపై వరంగల్ సీపీ రంగనాథ్(Warangal CP Ranganath) రియాక్ట్ అయ్యారు. ప్రశ్నపత్రం గంటన్నర తర్వాత వాట్సాప్ గ్రూపుల్లోకి వచ్చినట్లు చెప్పారు. ఆ క్రమంలో అది పేపర్ లీక్ అయినట్లు కాదన్నారు.
పదవులకు, చదువుకు సంబంధం లేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టంచేశారు. ఏ పని లేనివారే మోడీ చదువు గురించి చర్చ చేస్తున్నారని విమర్శించారు. ప్రపంచంలో గొప్ప నేతగా మోడీకి పేరుందని గుర్తుచేశారు.
అత్యంత ఎత్తయిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం నిర్మించింది. హైదరాబాద్ లోని కొత్త సచివాలయం సమీపంలో 125 అడుగుల ఎత్తులో విగ్రహం నిర్మించడంపై దళిత వర్గాలు సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపాయి.
ఈ లీకుల వెనుక ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు దాగి ఉన్నాయని సమాచారం. ప్రభుత్వ ఉపాధ్యాయులతో ఒప్పందం చేసుకుని ఇలా ప్రశ్నాపత్రాలు బయటకు తీసుకువస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. తమ విద్యార్థులకు అత్యధిక మార్కులు వచ్చేందుకు ప్రైవేటు యాజమాన్యాలు ఇలా లీకులకు తెర తీస్తున్నాయనే విమర్శలు వెలుగులోకి వచ్చాయి.
బలగం(Balagam) చిత్రాన్ని కొంత మంది అమెజాన్ ప్రైమ్ వీడియో నుంచి మూవీని పైరసీ చేసి గ్రామాల్లో ప్రదర్శించడంపై దిల్ రాజు(Dil Raju) పోలీసుల(police)కు ఫిర్యాదు చేశాడు. సిరికొండ గ్రామంలో బహిరంగంగా ప్రదర్శించారని అతనికి తెలియడంతో తమ ఆదాయానికి గండి పడకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చిత్ర సమర్పకుడు దిల్ రాజు నిజామాబాద్ పోలీసులకు కంప్లైంట్ చేశాడు. ఈ క్రమంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
అధికారిపైనే కుక్క దాడి చేసిందంటే ఇక ప్రజల పరిస్థితి ఏమిటో అని విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కుక్కల నియంత్రణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.