• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

చెరువులో దూకి మహిళా ఆత్మహత్య

RR: మహిళ ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన షాబాద్ మండల పరిధిలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు తాళ్లపల్లి గ్రామానికి చెందిన నందిని అనే వివాహిత నాగుల చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 22, 2026 / 09:55 AM IST

జిల్లాలో చికెన్ ధరలు ఇవే

SRCL: జిల్లాలో చికెన్ ధరలు ఆదివారం ఈ విధంగా ఉన్నాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో స్కిన్ చికెన్ కేజీ ధర రూ. 206 నుంచి రూ. 230 మధ్య ఉండగా, స్కిన్‌లెస్ చికెన్ కేజీ ధర రూ. 234 నుంచి రూ. 260 వరకు పలుకుతోంది. గత వారంతో పోలిస్తే రూ. 5 వరకు తగ్గిందని విక్రయదారులు తెలిపారు.

February 22, 2026 / 09:54 AM IST

పుష్కరిణి వద్ద క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం

RR: మహాశివరాత్రి జాతర సందర్భంగా సంత్ నిరంకార్ ఆధ్వర్యంలో చేవెళ్ల వెంకటేశ్వర పుష్కరిణి వద్ద శ్రమదానంతో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపల్ ఛైర్మన్ సమతా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, జాతరకు వచ్చే భక్తులు పరిశుభ్రతను కాపాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పాల్గొన్నారు.

February 22, 2026 / 09:51 AM IST

రైలు ఎక్కుతూ ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి

HYD: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆదివారం జరిగిన ప్రమాదంలో ఓ ప్రయాణికుడు మృతి చెందాడు. కదులుతున్న రైలు ఎక్కే క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలిలోనే ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోవడంతో ప్రయాణికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. రైల్వే పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

February 22, 2026 / 09:51 AM IST

ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల చెల్లింపులో జాప్యం లేదు

జగిత్యాల రూరల్ మండల పరిధిలోని కల్లెడ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపుపై వస్తున్న వార్తలపై మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎంపీడీవో రమాదేవి స్పందించారు. ఆధార్ కార్డు మిస్ మ్యాచింగ్ వల్లనే బిల్లులు ఆగావని, లబ్ధిదారులు ఆపపోహలు నమ్మవద్దని అర్హులైన లబ్ధిదారులకు బిల్లులు వస్తాయని హామీ ఇచ్చారు.

February 22, 2026 / 09:50 AM IST

నేడు బాధ్యతలు స్వీకరించనున్న చైర్మన్

BHPL: జిల్లా మున్సిపాలిటీ ఛైర్మన్‌గా బుర్ర కొమరయ్య నేడు పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించి ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఇవాళ స్థానిక హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అక్కడి నుంచి విజయోత్సవ ర్యాలీతో మున్సిపల్ కార్యాలయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 2 గంటలకు బాధ్యతలు చేపట్టనున్నారు.

February 22, 2026 / 09:48 AM IST

శవాన్ని దోచుకున్న దొంగలు అరెస్ట్

MBNR: ప్రమాదంలో మరణించిన లేదా అపస్మారక స్థితిలో ఉన్న బాధితుల వద్ద ఉన్న నగలు, నగదును దోచుకుంటున్న ఇద్దరు వ్యక్తులను షాద్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 17 రాత్రి రాయికల్ టోల్ ప్లాజా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన పురుషోత్తం రెడ్డి మృతదేహంపై ఉన్న బంగారు నగలు కనిపించకపోవడంతో అతని సోదరుడు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు నిందుతులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

February 22, 2026 / 09:47 AM IST

ఉషన్నపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి పురస్కారం

PDPL: కాల్వ శ్రీరాంపూర్ మండలం ఊషన్నపల్లి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్యకు 2026 ఏడాదికి గాను ప్రతిష్ఠాత్మక ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సేవా పురస్కారం’ వరించింది. విద్యా, సాహిత్య, సామాజిక రంగాల్లో ఆయన చేసిన కృషికిగాను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు. ‘మధురిమలు’ కవితా ప్రక్రియ ప్రోత్సాహం గుర్తించామన్నారు.

February 22, 2026 / 09:47 AM IST

‘పులి పాదముద్రలు కనిపిస్తే సమాచారం అందించాలి’

BDK: ఎక్కడైనా పులి పాదముద్రలు కనిపిస్తే అటవీ అధికారులకు సమాచారం అందించాలని డీఎఫ్ఓ కృష్ణ గౌడ్ కోరారు. జిల్లా అటవీ ప్రాంతంలోకి పులి ప్రవేశించినట్లు ధ్రువీకరించారు. గతంలో సంచరించిన పులి కాకుండా, ఇది కొత్తదని గుర్తించినట్లు ఆయన నేడు తెలిపారు. ఈ నేపథ్యంలో పశువుల కాపర్లు, రైతులు అటవీ ప్రాంతంలోకి ఒంటరిగా వెళ్లవద్దని, గుంపులుగా వెళ్లాలని సూచించారు.

February 22, 2026 / 09:47 AM IST

పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ‘ఖాకీ కిడ్స్’ కార్యక్రమం

ఆదిలాబాద్ జిల్లాలో ‘అరైవ్ ఆలైవ్’లో భాగంగా ఎస్పీ అఖిల్ మహాజన్ ‘ఖాకీ కిడ్స్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి ఒక కానిస్టేబుల్ వారానికి 3 పాఠశాలల్లో సైబర్ నేరాలు, ట్రాఫిక్ నియమాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తారని తెలిపారు. హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడంపై అవగాహన పొందిన విద్యార్థులకు ప్రత్యేక బ్యాడ్జీలు అందజేస్తామన్నారు.

February 22, 2026 / 09:45 AM IST

విచ్చలవిడిగా అక్రమ ఇసుక రవాణా

KMM: వేంసూరు మండలంలో మర్లపాడు గ్రామంలో అక్రమ ఇసుక రవాణా జరుగుతున్నట్లు ఆదివారం తెలిపారు. రెవెన్యూ అధికారులు అక్రమార్కులకు కొమ్ములు కాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లైసెన్సు లేని ఇసుక ట్రాక్టర్లు విచ్చలవిడిగా తిరుగుతున్న ప్రాణాలు అరచేతిలో పట్టుకుని ప్రజలు తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించాలని అన్నారు.

February 22, 2026 / 09:42 AM IST

అధ్వానంగా మారిన పెద్దేముల్-తాండూర్ రోడ్డు

VKB: తాండూర్ నుంచి పెద్దేముల్ వెళ్ళే రోడ్డు మార్గం గుంతలతో అధ్వానంగా మారడంతో ప్రయాణీకులు పెద్ద ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర సమయంలో గర్భిణులు, రోగులను ఆసుపత్రికి తరలించడంలో రోడ్డు పరిస్థితి ప్రాణసంకటంగా మారిందని స్థానికులు తెలిపారు. వాహనదారులు, ప్రజా ప్రతినిధులు సంబంధిత అధికారులను సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరుతున్నారు.

February 22, 2026 / 09:38 AM IST

‘రోడ్డు ప్రమాదాలను అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత’

ADB: రోడ్డు ప్రమాదాలను అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత అని SP అఖిల్ మహాజన్ తెలియజేశారు. జిల్లాలో ప్రమాదాలను నివారించడానికి మొట్టమొదటిసారిగా ‘ఖాకీ కిడ్స్’ పేరుతో నూతన కార్యక్రమాన్ని పోలీస్ కార్యాలయంలో ఎస్పీ శనివారం లాంచనంగా ప్రారంభించారు. విద్యార్థులకు సైబర్ నేరాలు, ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

February 22, 2026 / 09:38 AM IST

టార్గెట్ రీచ్ కోసం ఉత్పత్తి కసరత్తులు

PDPL: సింగరేణి సంస్థ 6 జిల్లాలలో 2025-26 ఆర్థిక సంవత్సర టార్గెట్ 72 మిలియన్ టన్నులు బొగ్గు ఉత్పత్తిని చేరుకోవడానికి అధికారులు, ఉద్యోగులు కృషి చేస్తున్నారు. ఇప్పటివరకు 51.70MT బొగ్గు ఉత్పత్తి చేయబడి, 82% రీచ్ నమోదు అయింది. మార్చి చివరిలో 20.30MT బొగ్గును ఉత్పత్తి చేయాల్సి ఉన్నందున, అధికారులు ఉత్పత్తిని పెంచడానికి ప్రత్యేక ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.

February 22, 2026 / 09:32 AM IST

పొలాల్లోకి దూసుకెళ్లిన కారు..!

NZB: ఎడపల్లి మండలంలోని పెద్దవాగు బ్రిడ్జి వద్ద ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం తప్పింది. బోధన్ నుంచి నిజామాబాద్ వెళ్తున్న కారు అదుపుతప్పి 15 అడుగుల ఎత్తు నుంచి పొలాల్లోకి దూసుకెళ్లింది. కారు పూర్తిగా ధ్వంసమైనప్పటికీ, డ్రైవర్ సీటు బెల్ట్ ధరించడం వల్ల ప్రాణాపాయం తప్పింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

February 22, 2026 / 09:29 AM IST