ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ చేసిన ఈడీ ఈరోజు కోర్టుకు హాజరు పరిచింది. తనను అక్రమంగా అరెస్టు చేసినట్లు కవిత సంచలనమైన వ్యాఖ్యలు చేసింది.
సుప్రీంకోర్డు అరెస్ట్ చేయమని చెప్పిన తరువాత కవితను ఎలా అరెస్ట్ చేస్తారని అధికారులపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలని అరెస్ట్ చేయాడానికే ఈడీ శుక్రవారం వచ్చారని అన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన 10 మంది అధికారుల బృందం సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
CM Revanth Reddy: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అదే సమయంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు ఉన్నారు. దీంతో దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇది వరకే చాలా మంది ముఖ్య నేతలు పార్టీ వీడిన సంగతి తెలిసిందూ. దాన్న...
ఏపీ, తెలంగాణల్లో కొన్ని చోట్ల ఎండలు మండిపోతున్నాయి. మార్చిలోనే ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ చెబుతోంది.
ఒక వాహనం నంబర్ ప్లేట్ పై టీఎస్ అని ఉంటే మనం దాన్ని తెలంగాణలో రిజిస్టర్ అయిన వాహనం అని గుర్తిస్తాం. అయితే ఇప్పుడు ఈ రాష్ట్ర నెంబర్ ప్లేట్లపై టీఎస్కి బదులుగా టీజీ రానుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
రంజాన్ పండుగ మొదటి రోజు ఓ హాటల్ వద్ద భోజన ప్రియులు అల్లరి చేశారు. ఉచిత హాలీమ్ ఆఫర్ ఉండడంతో వందలాది సంఖ్యలో కస్టమర్స్ వచ్చారు. చేసేది ఏం లేక నిర్వహకులు చేతులు ఎత్తేశారు. పోలీసులు లాఠీలకు పని చెప్పారు.
కరీంనగర్ కదనభేరి సభలో కేసీఆర్ ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, అటు బీజేపీ ప్రభుత్వాన్ని ఎండగట్టారు. రైతు బంధు అడిగితే చెప్పుతో కొడుతా అంటున్నారు. పేగులు మెడలో వేసుకుంటా, మానవ బాంబును అవుతా అని అంటున్నారు అని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ప్రసంగించారు.
సచివాలయంలో తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కొనసాగింది. రేపోమాపో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రానుందనే ప్రచారం నేపథ్యంలో కేబినెట్ భేటీ కానుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. సికింద్రాబాద్లో నిర్వహించిన బీజేపీ సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో అమిత్ షా పాల్గొన్నారు.
ఈరోజు జరిగే కరీంనగర్ సభకు తాను హాజరు కాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. గత రెండు రోజులుగా ఇంట్లోనే వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.