MDK: తూప్రాన్ పట్టణం మూడో వార్డులో సీసీ రోడ్డు తొలగింపు పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై గంగరాజు తెలిపారు. మూడో వార్డులో అనుమతి లేకుండా బాలు సీసీ రోడ్డును తొలగించినట్లు మున్సిపల్ కమిషనర్ గణేష్ రెడ్డి ఫిర్యాదు చేసినట్లు వివరించారు. రోడ్డును తొలగించి ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలిగించినట్లు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు వివరించారు.
NZB: నవీపేట్ మండలం కమలాపూర్ నుంచి నిజామాబాద్ వెళ్లే రహదారిపై గురువారం ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తి ప్రమాదవశాత్తు కిందపడడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వ్యక్తిని సమీప ఆసుపత్రికి తరలించారు.
MBNR: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని కౌకుంట్ల మండల కేంద్రంలోని జామియా మసీదులో ముస్లిం సోదరులకు గురువారం సాయంత్రం తెలంగాణ బ్యాంకు ఉద్యోగి శ్రీనివాసులు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అన్నీ మతాల ప్రజలు ఐక్యతతో పండుగలు జరుపుకోవాలని శ్రీనివాసులు పిలుపునిచ్చారు. అనంతరం ముస్లిం సోదరులు బ్యాంక్ శ్రీనుకు శాలువాతో ఘనంగా సన్మానించారు.
KNR: విద్యుత్ మెటీరియల్ త్వరగా విడుదల చేయడానికి, మెటీరియల్ను త్వరగా డ్రా చేసుకోవడానికి ఈ స్టోర్ల ద్వారా ఆన్లైన్ సౌకర్యం అందిస్తున్నామని టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి తెలిపారు. వాట్సాప్ చాట్ ప్రవేశ పెట్టడం జరిగిందని, దీని ద్వారా సమస్యల పరిష్కారం కోసం వినియోగదారులు 7901628348 ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చని అన్నారు.
WGL: వృద్ధులకు వికలాంగులకు నూతన పెన్షన్ మంజూరు చేయాలని ఇవాళ MCPIU పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం పార్టీ మండల కార్యదర్శి జన్ను రమేష్ మాట్లాడుతూ.. గత రెండు సంవత్సరాల కాలం నుంచి వికలాంగులకు వృద్ధులకు పెన్షన్ రాలేకపోవడం వలన ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. అధికారులు స్పందించి కోరారు.
MBNR: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ కూడలిలో గురువారం నిర్వహించిన ఇఫ్తార్ వేడుకలలో మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఆనంద్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అల్లా ఆశీస్సులతో ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన కాంక్షించారు. కార్యక్రమంలో రెండవ పట్టణ సీఐ ఐజాజుద్దీన్, మైనార్టీ నేతలు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
HYD: NSUI తెలంగాణ రాష్ట్ర యూనిట్ కీలక నియామకాలు చేసింది. ఇందులో భాగంగ కొత్తగాడి వరుణ్ కుమార్ను నిజాం కాలేజీ అధ్యక్షుడిగా నియమించారు. ఈ నియామకాలను NSUI రాష్ట్ర అధ్యక్షుడు యాదవల్లి వెంకటస్వామి ప్రకటించారు. ఈ సందర్భంగా వరుణ్ మాట్లాడుతూ.. విద్యార్థుల సమస్యల పరిష్కరానికి కృషి చేస్తానని, తన ఎన్నికకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.
ADB: మహిళలు ధైర్యంతో ముందడుగు వేసి అన్ని రంగాల్లో తమ సత్తా చాటాలని ఆదిలాబాద్ మున్సిపల్ ఛైర్ పర్సన్ బండారి అనూష పిలుపునిచ్చారు. గురువారం పట్టణంలోని వెటర్నరీ ఆస్పత్రిలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళల ఎదుగుదలకు ప్రభుత్వం ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించిందని ఆమె అన్నారు.
NGKL: అమ్రాబాద్ మండల కేంద్రంలోని ఓ పాఠశాలలో మన్య ప్రాణుల సంరక్షణ గురించి ఇవాళ అవగాహన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అరుణ హాజరై మాట్లాడుతూ.. అడవి జంతువులను వేటాడకూడదని, అడవిలోకి ప్లాస్టిక్ తీసుకెళ్లకూడదని విద్యార్థులకు సూచించారు. మూగజీవాలకు హాని తలపెట్టకుండా పర్యావరణాన్ని కాపాడాలని ఆమె పిలుపునిచ్చారు.
SDPT: వర్గల్ మండలం నాచారం గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 8 నుంచి 19 వరకు నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని జిల్లా ఇంఛార్జ్ మంత్రి వివేక్ వెంకట స్వామికి ఆలయ బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను మాజీ ఎమ్మెల్యే తూముకుంట నరసారెడ్డి, ఆలయ ఛైర్మన్ పల్లెర్ల రవీందర్ గుప్తా, ఆలయ ఈవో రంగాచారి అందజేశారు.
PDPL: సుల్తానాబాద్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి ఓపీ, డెంటల్ సేవలు, గర్భిణీల హెల్త్ చెకప్ షెడ్యూల్, వ్యాక్సినేషన్ పూర్తి స్థితిని పరిశీలించారు. రోగులతో మాట్లాడి అందుతున్న సేవలపై ఆయన ఆరా తీశారు. ఎన్.సి.డి విభాగంలో ఏవైనా మందుల కొరత రాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
SRCL: జిల్లా కేంద్రంలో నూతన న్యాయస్థాన భవన సముదాయానికి శ్రీకారం జరగనుంది. పెరిగిన జనాభా అవసరాలకు అనుగుణంగా రూపు దిద్దుకోనున్న న్యాయస్థాన భవనానికి ఈ నెల 7వ తేదీ శనివారం ఉదయం 10 గం.లకు శంకుస్థాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్టు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజ వెల్లడించారు.
MNCL: ఎట్టకేలకు శాంతిఖని గని ప్రమాదంపై కార్పొరేట్ యజమాన్యం స్పందించింది. ఓ ప్రధాన అధికార యూనియన్ అగ్రనేత జోక్యంతో గని ప్రమాదంపై ఉన్నతాధికారుల్లో శీగ్రగతిన కదలిక వచ్చింది. బెల్లంపల్లి శాంతిఖనిలోఇటివల జరిగిన ప్రమాదంలో కోట మనికేశ్వర్ అనే బదిలీ కార్మికుడు గాయపడ్డాడు. ఈ సంఘటనలో అతని చేతి వేలు కు తీవ్రంగా గాయం అయింది.
ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో జరిగే అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య అధికారులను ఆదేశించారు. ఖమ్మం నగరంలోని 54, 48 డివిజన్లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను గురువారం కమిషనర్ తనిఖీ చేశారు. నగరవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి పనులు నిర్దేశిత కాల పరిమితి లోపు పూర్తి చేయాలని, ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు.
NRML: జిల్లాలో అక్రమ ఇసుక రవాణాను పూర్తిగా అడ్డుకట్ట వేసేందుకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన చర్యలను చేపట్టడం జరిగిందని ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. ఇందులో భాగంగా బాసర,సారంగాపూర్ సరిహద్దుల్లో అంతరాష్ట్ర చెక్పోస్టులను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేశామన్నారు.