MDK: పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో రాజ్పల్లి జెడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. ప్రతిరోజూ రాత్రి 8 నుంచి 10 గంటల వరకు విద్యార్థుల ఇళ్లను సందర్శిస్తూ, వారి చదువును పర్యవేక్షిస్తున్నారు. విద్యార్థులకు ప్రత్యేక సమయసారిణిని అందజేయడమే కాకుండా, ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం కల్పించాలని తల్లిదండ్రులకు సూచిస్తున్నారు.
JGL: జిల్లాలో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు 30 కేంద్రాల్లో ప్రశాంతంగా జరిగాయి. జనరల్ కోర్సుల్లో 6,879 మంది, ఒకేషనల్లో 1,029 మంది హాజరుకాగా 253 మంది గైర్హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ ఎస్కేఎన్ఆర్ జూనియర్ కళాశాలను పరిశీలించారు. అదనపు కలెక్టర్ బి.ఎస్.లత పలు కేంద్రాలు సందర్శించారు. ఒక విద్యార్థి ఆలస్యంగా రావడంతో అనుమతించలేదు.
HYD: హబ్సిగూడలో నివసించే ఓ విశ్రాంత శాస్త్రవేత్త ఇంట్లో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు 48 గంటల్లోనే ఛేదించారు. ఇంట్లో పనిమనిషే 9.30 తులాల బంగారాన్ని దొంగిలించినట్లు గుర్తించారు. బాధితుడి ఫిర్యాదుతో నిందితురాలిని అరెస్ట్ చేసిన పోలీసులు, ఆమె వద్ద నుంచి దొంగిలించిన నగలను స్వాధీనం చేసుకున్నారు.
KMM: తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఢిల్లీలో లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కుటుంబ సమేతంగా మర్యాదపూర్వకంగా కలిశారు. మార్చి 5న హైదరాబాద్లో జరగనున్న తన కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహ వేడుకకు విచ్చేసి, నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరుతూ ఆయనకు వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు.
MHBD: బయ్యారం మండల కేంద్రంలో బుధవారం తుడుందెబ్బ జాతీయ కన్వీనర్ లక్ష్మయ్య ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మార్చి 8న గుండాలలో నిర్వహించనున్న ఆదివాసీ మహిళల హక్కుల రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం రాష్ట్ర సదస్సు పత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ నాయకులు ఉన్నారు.
ADB: లంబాడి హక్కుల పోరాట సమితి నార్నూర్ మండలాధ్యక్షుడిగా జాదవ్ కైలాష్ బుధవారం నియామకమయ్యారు. ఈ సందర్బంగా LHPS రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ భరత్ చౌహన్ ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. లంబాడీ-బంజారా సమాజాభివృద్ధి, సంస్కృతి, సంప్రదాయాలను బలోపేతం, లంబాడీల హక్కుల సాధన కోసం కృషి చేయాలనీ పేర్కొన్నారు. దీంతో పలువురు కైలాష్ను అభినందించారు.
VKB: కుల్కచర్ల మండలంలో అకాల వర్షాంతో మామిడి రైతులు అవస్థలు పడుతున్నారు. వేరుశనగ రైతులు పల్లికాయలకు నీరు సమృద్ధిగా అందుతుందని ఆనందం వ్యక్తం చేస్తుండగా.. మామిడి రైతులు మాత్రం దిగాలుగా ఉన్నారు. వేసవికాలంలో వర్షాలు కురుస్తుండటంతో తాము తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందని బాధిత రైతులు వాపోతున్నారు.
SRCL: మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం మున్సిపల్ కార్యాలయం ముందు కార్మికులు ధర్నా నిర్వహించారు. 2009 నుంచి 2012 వరకు పెండింగ్లో ఉన్న 3 ఏళ్ల పీఎఫ్ బకాయిలను వెంటనే కార్మికుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. కమిషనర్ ఖదీర్ పాషా వారం రోజుల్లోగా సమస్యలను పరిష్కరిస్తామన్నారు.
NRML: చిత్తడి నేలల వల్ల భూగర్భ జలమట్టం పెరగడమే కాకుండా, జీవవైవిధ్యం పెంపొందుతుందని జిల్లా కలెక్టర్ అభిలాష అన్నారు. గురువారం ప్రకటనలో వారు మాట్లాడుతూ.. జిల్లాలో గుర్తించిన చిత్తడి నేలలను కేవలం పర్యావరణ దృక్కోణంలోనే కాకుండా, పర్యాటక కేంద్రాలుగా కూడా తీర్చిదిద్దే అవకాశం ఉందని కలెక్టర్ అభిప్రాయపడ్డారు.
JGL: గ్రామాల్లో పారిశుధ్యం పట్ల నిర్లక్ష్యం చేసే వారిపై చర్యలు తీసుకుంటామని జిల్లా పంచాయతీ అధికారి చీకోటి మదన్ మోహన్ అన్నారు. బుధవారం పెగడపల్లి మండలం నర్సింహునిపేట గ్రామంలో పారిశుధ్య పనులను డీపీవో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామాల్లో రోడ్లు, మురికి కాలువల పరిశుభ్రతను తరచూ చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో ప్రేమ్ సాగర్ పాల్గొన్నారు.
SRD: సదాశివపేట మున్సిపాలిటీ అభివృద్ధికి తన వంతు పూర్తి సహకారం అందిస్తానని జిల్లా ఇంఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ అంజమ్మ వైస్ చైర్మన్ రేణుకలు ఇంఛార్జ్ మంత్రి వివేక్ను బుధవారం కలిశారు. మంత్రి మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో పెండింగ్ పనులు పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
PDPL: 2027లో జిల్లాలో నిర్వహించే గోదావరి పుష్కరాలకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. బుధవారం ఆయన సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పుష్కర దేశాలలో ఘాట్ నిర్మాణం, రోడ్డు విస్తరణ, లైట్లు, ఆలయాల అభివృద్ధి ప్రతిపాదనలు కట్టుదిట్టంగా సిద్ధం చేయాలని సూచించారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు
NZB: జిల్లా సిరికొండ మండలం కమ్మార్పల్లి అటవీ రేంజ్ పరిధిలో పులి సంచారం కలకలం రేపుతుంది. ఈ నేపథ్యంలో బుధవారం జిల్లా అటవీ అధికారి వికాస్ మీనా (నిజామాబాద్), ఆర్మూర్ అటవీ విభాగాధికారి బీ. భవాని శంకర్, సిరికొండ ఎఫ్.ఆర్.వో నర్సింగరావు, శక్తి గంగారం, క్షేత్రస్థాయి పరిశీలనలు చేపట్టారు.
SRPT: లాకప్ డెత్లో మృతి చెందిన దళిత యువకుడు కర్ల రాజేశ్ కుటుంబాన్ని పరామర్శించేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపు (గురువారం) మధ్యాహ్నం 2:00 గంటలకు కోదాడకు రానున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు మధ్యాహ్నం లోపు మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ నివాసానికి చేరుకోవాలని కార్యాలయం ఇవ్వాళ ఒక ప్రకటనలో కోరింది.
NLG: ఈ నెల 17న చిట్యాల మండలం, గుండ్రాంపల్లి శివారులో బైక్ అదుపుతప్పి తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. శేఖర్ (34) ఫిబ్రవరి 17న కూలి పని కోసం భైరవునిబండ నుంచి మిత్రుడితో చౌటుప్పల్కు వెళుతుండగా గుండ్రాంపల్లి వద్ద బైకు అదుపుతప్పి రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడ్డాడు. నిమ్స్లో చికిత్స పొందుతూ.. మృతి చెందినట్లు ఎస్సై రవికుమార్ తెలిపారు.