• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన.. మండల వైద్యాధికారి

WGL: పర్వతగిరి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని మండల వైద్యాధికారి డాక్టర్ మౌనిక ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మౌనిక పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం డాక్టర్ మౌనిక మాట్లాడుతూ.. ప్రస్తుత నెలలో 182 మందికి ఓపీ సేవలు, 117 మందికి రక్త పరీక్షలు, 1404 మందికి వివిధ టెస్టులు నిర్వహించినట్లు వివరించారు. వైద్య సిబ్బంది ఉన్నారు.

February 25, 2026 / 11:11 AM IST

ప్రభుత్వ కళాశాలను పరిశీలించిన తహశీల్దార్

MDK: నార్సింగి మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న వార్షిక పరీక్షలను తహశీల్దార్ గ్రేసి బాయ్ సిబ్బందితో కలిసి పరిశీలించారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో సజావుగా జరుగుతున్నాయని ఆమె తెలిపారు. అవసరమైన భద్రతా చర్యలు తీసుకున్నామని పేర్కొంటూ, విద్యార్థులు ధైర్యంగా పరీక్షలు రాయాలని సూచించారు.

February 25, 2026 / 11:09 AM IST

పశు ఔషధ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తులు

KMM: పశువులకు జనరిక్ మందులు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం పశు ఔషధ విక్రయ కేంద్రాల ఏర్పాటుకు అవకాశం కల్పిస్తోందని జిల్లా పశువైద్య అధికారి బి. పురంధర్ తెలిపారు. జిల్లాకు ఒకటి, మండలానికి ఒక కేంద్రం చొప్పున సహకార సంఘాల ద్వారా వీటిని స్థాపించవచ్చు. 120 గజాల స్థలం, ఫార్మసిస్ట్ రిజిస్ట్రేషన్ కలిగిన వారు రూ.5 వేల ఫీజుతో ఆన్ లైన్ల లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

February 25, 2026 / 11:08 AM IST

నాంపల్లి ఎగ్జిబిషన్‌లో 264పై కేసు నమోదు..!

HYD: నాంపల్లి ఎగ్జిబిషన్‌లో 264 మంది పోకిరీలను షీ టీమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందులో 242 మంది మేజర్లు, 22 మంది మైనర్లు ఉన్నట్లు గుర్తించారు. 56 మందిపై కేసులు నమోదు చేయగా.. 52 మందికి రూ.1,050ను కోర్టు జరిమానా విధించింది. నలుగురికి రెండు రోజుల జైలు శిక్షతో పాటు రూ.1000 జరిమానా విధించగా..188 మందికి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చారు.

February 25, 2026 / 11:08 AM IST

దేవరకొండలో ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు ప్రారంభం

నల్లగొండ: జిల్లా దేవరకొండ పట్టణంలో బుధవారం ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పట్టణంలోని 4 కేంద్రాలలో మొత్తం 1,210 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు తాగునీరు, వెలుతురు వంటి సౌకర్యాలు కల్పించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.

February 25, 2026 / 11:07 AM IST

‘వ్యవసాయ కనెక్షన్లు వేగంగా మంజూరు’

PDPL: పెద్దపల్లి సర్కిల్‌లో రైతులకు నిరంతర, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు, వ్యవసాయ కనెక్షన్లు వేగంగా మంజూరు చేస్తున్నట్లు ఎస్ఈ వి.గంగాధర్ తెలిపారు. డిసెంబర్ నుంచి ఇప్పటివరకు 344 సర్వీసులు మంజూరు చేసినట్లు వెల్లడించారు. పంటల కోత అనంతరం రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.

February 25, 2026 / 11:07 AM IST

డిసెంబర్ నుంచి 656 కొత్త సర్వీసుల మంజూరు

జగిత్యాల జిల్లాలో రైతులకు నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా వ్యవసాయ విద్యుత్ సర్వీసులను గరిష్ఠ స్థాయిలో మంజూరు చేసినట్లు SE బి. సుదర్శనం తెలిపారు. వ్యవసాయ రంగానికి విద్యుత్ శాఖ అత్యంత ప్రాధాన్యం ఇస్తుందన్నారు. డిసెంబర్ నుంచి ఇప్పటివరకు మొత్తం 656 వ్యవసాయ సర్వీసులు మంజూరు చేశామన్నారు.

February 25, 2026 / 11:06 AM IST

గట్టు మండల కేంద్రంలో రోడ్డుపై నీరు

GDWL: గట్టు మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు వర్షపు నీరు నిలిచి వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కురిసిన స్వల్ప వర్షంతో మురుగు నీరు, వర్షపు నీరు కలిసి రోడ్డు కుంటలా మారింది. ప్రధాన రహదారిపై వాహనాలు ప్రయాణించలేక అవస్థలు పడుతున్నారని, అధికారులు తక్షణమే నీటిని తొలగించి శాశ్వత పరిష్కారం చూపాలని సూచించారు.

February 25, 2026 / 11:05 AM IST

ఉద్యమకారుల సంక్షేమానికి కృషి: MLA

HNK: ఉద్యమకారుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. హనుమకొండ సుబేదారిలోని క్యాంప్ ఆఫీస్‌లో పలువురు ఉద్యమకారులు ఎమ్మెల్యేతో భేటీ అయి ఉద్యమకారులకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఉద్యమకారులకు అండగా ఉంటూ వారి సమస్యలు సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే అన్నారు.

February 25, 2026 / 11:03 AM IST

జాగ్రత్తగు పాటిస్తూ పనులను చేసుకోవాలి: DRDA

MNCL: వేసవి నేపథ్యంలో ఉపాధి కూలీలు జాగ్రత్తలు తీసుకుని పనులు చేసుకోవాలని మంచిర్యాల డీఆర్డీఏ పిడి కిషన్ సూచించారు. బుధవారం జన్నారం మండలంలోని మహమ్మదాబాద్ రోటిగూడ అటవీ ప్రాంతాలలో ఉపాధి పనుల ద్వారా చేపట్టిన సిప్- బండ్ పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రతి కూలికి రోజు రూ.307 వేతనం వచ్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అధికారులు ఉన్నారు.

February 25, 2026 / 11:01 AM IST

మెదక్ పోలీసులకు 6 రజత పతకాలు

MDK: తెలంగాణ పోలీస్ ఆధ్వర్యంలో సైబరాబాద్ కమిషనరేట్‌లో నిర్వహించిన 4వ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో మెదక్ పోలీసులు 6 రజత పతకాలు సాధించారు. టెన్నిస్‌లో రాథోడ్ రమేశ్ సింగిల్స్, డబుల్స్, గ్రూప్ ఈవెంట్స్‌లో హ్యాట్రిక్ రజతాలు గెలిచారు. ఎస్పీ డీవీ శ్రీనివాస రావు విజేతలను సత్కరించి అభినందించారు. కబడ్డీలో భవాని, వీణ, సుష్మ జట్టును మూడో స్థానానికి తీసుకువచ్చారు.

February 25, 2026 / 11:01 AM IST

‘సీఎం కప్ పోటీలో ప్రతిభ కనబరిచిన జిల్లా క్రీడాకారులు’

ADB: ఈనెల 20 నుంచి నల్గొండ జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి సీఎం గా పోటీలో అదిలాబాద్ జిల్లా ఖో ఖో జట్టు విజేతగా నిలిచింది. ఈ మేరకు ప్రథమ బహుమతి పొందిన విద్యార్థులను కలెక్టర్ రాజర్షి షా అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థులు చదువుతోపాటు ఆటల్లో ప్రతిభ కనబరచడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అదనపు కలెక్టర్ శ్యామల దేవి, అధికారులు, తదితరులు ఉన్నారు.

February 25, 2026 / 11:00 AM IST

జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్న ఇంటర్ పరీక్షలు: కలెక్టర్

NGKL: జిల్లాలో ఇంటర్ తొలి రోజు పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని కలెక్టర్ బాదావత్ సంతోష్ పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన 34 కేంద్రాల్లో ఫస్ట్ ఇయర్ 7,557 మంది విద్యార్థులు హాజరు అయ్యారని తెలిపారు. రేపు సెకండ్ ఇయర్ 7,616 మంది స్టూడెంట్స్ హాజరుకానున్నారని తెలిపారు. తాగునీటి సదుపాయం, గాలి, వెలుతురు లాంటి అంశాలను కలెక్టర్ పర్యవేక్షించారు.

February 25, 2026 / 10:59 AM IST

రోడ్డు మరమ్మతులు ప్రారంభం

SDPT: దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు కౌన్సిలర్ వనం రమేశ్ ఆధ్వర్యంలో ధర్మాజీపేట వెళ్లే రోడ్డుకు మరమ్మతుల పనులను ప్రారంభించారు. రోడ్డుపై గుంతలు పడడంతో RTC బస్సులు, ఆటోలు, ద్విచక్ర వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా JCBతో మరమ్మతుల పనులు చేపట్టారు.

February 25, 2026 / 10:59 AM IST

ఏళ్ల తరబడి ములకుబడిన వాహనాల తొలగింపు

MDCL: మల్కాజ్‌‌‌గిరి పరిధిలో రహదారుల మధ్య సంవత్సరాలుగా మూలకు పడి తుప్పు పట్టిన వాహనాలపై అధికారులు చర్యలు చేపట్టారు. కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి ప్రత్యేక ఆదేశాల మేరకు మల్కాజ్‌గిరి జోన్‌లో 39, ఉప్పల్ జోన్‌లో 40, ఎల్బీనగర్ జోన్‌లో 10 వాహనాలను తొలగించారు. మొత్తం 89 వాహనాలు స్వాధీనం చేసుకుని ట్రాఫిక్‌కు ఆటంకం లేకుండా మార్గాలను స్వచ్ఛంగా మార్చారు.

February 25, 2026 / 10:55 AM IST