• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

మహిళలకు సానిటరీ ప్యాడ్ కిట్లు పంపిణీ

SDPT: బ్లాక్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు లహరి ఆధ్వర్యంలో గురువారం చిన్నకోడూరు మండలం ఎల్లమ్మ జూలూరు గ్రామంలో మహిళలకు సానిటరీ కిట్లను కాంగ్రెస్ జిల్లా మహిళ అధ్య క్షురాలు ముద్ధం లక్ష్మి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతినెల మహిళలకు నెలసరికి వాడే సానిటరీ కిట్స్ విషయంలో అనారోగ్యం బారిన పడకుండా ప్రభుత్వం మహిళలకు అందజేయడం శుభ పరిణామం అన్నారు.

March 5, 2026 / 08:26 PM IST

మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందు: MLA

BHPL: చెల్పూర్ గ్రామంలో మసీదులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అన్ని మతాలు చెప్పేవి ఒకటేనని మనుషులంతా సోదరా భావంతో ఉండాలన్నారు. మసీదుకు కావాల్సిన మౌలిక సదుపాయాల కోసం తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు.

March 5, 2026 / 08:25 PM IST

పది పరీక్షలకు ఒత్తిడికి లోనవద్దు: కలెక్టర్

ఖమ్మం రూరల్ మండలం కోదాడ క్రాస్ రోడ్ వద్ద ఉన్న సాంఘిక సంక్షేమ బాలికల గురుకులంను గురువారం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదో తరగతి విద్యార్థులు భయం ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పరీక్షలకు హాజరు కావాలని సూచించారు. తరగతి గదులు వంటగది ఆహార నాణ్యతను పరిశీలించి విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని అధికారులను ఆదేశించారు.

March 5, 2026 / 08:23 PM IST

క్రీడా పాఠశాలల్లో ప్రవేశాల పోస్టర్‌ను ఆవిష్కరించిన కలెక్టర్

SRCL: క్రీడా పాఠశాలల్లో ప్రవేశాలకు సంబంధించిన పోస్టర్లను కలెక్టర్ గరిమ అగ్రవాల్ జిల్లా కలెక్టరేట్లో ఆవిష్కరించారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ తెలంగాణా రాష్ట్రం లోని వివిధ క్రీడల పాఠశాలలు: హకీంపేట్, కరీంనగర్, ఆదిలాబాద్ రీజనల్ స్పోర్ట్స్ స్కూల్ లో 2026-27 విద్యా సంవత్సరంలో 4వ తరగతిలో ఆసక్తి గల బాలబాలికలు ప్రవేశం కల్పించనున్నారు.

March 5, 2026 / 08:21 PM IST

ఐటీడీఏ పీవోకు జేఏసీ వినతిపత్రం

BDK: బంజారా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి రాహుల్‌కు గురువారం వినతిపత్రం సమర్పించారు. ఏజెన్సీ ప్రాంతంలో జీవో–3 పునరుద్ధరించి స్థానిక గిరిజనులతోనే ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరారు. అలాగే 1/70, పిసా చట్టాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో బంజారా మ్యూజియం ఏర్పాటు చేయాలని కోరారు.

March 5, 2026 / 08:19 PM IST

‘బీడీ కార్మికులకు పెన్షన్ పెంచాలి’

NRML: తెలంగాణ ప్రభుత్వం బీడీ కార్మికులకు ఎన్నికల హామీలు ఇచ్చిన పెన్షన్ పెంచే ఆమెని వెంటనే అమలు చేయాలని సీఐటీ జిల్లా కార్యదర్శి సురేష్ అన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయం ముందు బీడీ కార్మికుల ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం బీడీ కార్మికులకు రూ. 4016 పెన్షన్ ఇస్తామని ఎన్నికల హామీ ఇచ్చిందని వెంటనే అమలు చేయాలని కోరుతూ వినతిపత్రాన్ని అందజేస్తారు.

March 5, 2026 / 08:15 PM IST

అంతక్రియలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

SRD: కంగ్టి మండలం చాప్టా (బీ) గ్రామంలో గురువారం కరెంట్ షాక్‌తో రైతు బాలాజీ పాటిల్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన అంతక్రియల్లో నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే విజయ్ పాల్ రెడ్డి హాజరై కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే పేద రైతు కుటుంబానికి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

March 5, 2026 / 08:14 PM IST

‘నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంలో ప్రభుత్వం విఫలం’

ASF: నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని KVPS జిల్లా కార్యదర్శి కార్తీక్ విమర్శించారు. గురువారం ఆసిఫాబాద్ లో మాట్లాడుతూ.. కాంగ్రెస్ సర్కార్ అధికారంలో వచ్చి రెండేళ్లు గడుస్తున్నా నిరుద్యోగులకు ఎన్నికల్లో ఇచ్చి హామీలను నేటికీ అమలు చేయలేదని ఆరోపించారు. సర్కార్ ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ భృతి,రాజీవ్ యువ వికాసం పథకాన్ని అమలు చేయాలన్నారు.

March 5, 2026 / 08:14 PM IST

కొడిమ్యాల పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

JGL: కొడిమ్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని జగిత్యాల జిల్లా అదరపు కలెక్టర్ బిఎస్ లత గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ విద్యార్థులు మానసికం ప్రశాంతతతో పరీక్షలు రాయాలని, వారికి పరీక్ష కేంద్రంలో తగిన ఏర్పాట్లు చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.

March 5, 2026 / 08:13 PM IST

BRSలో చేరిన చిన్న గోల్కొండ గ్రామ నాయకులు

RR: రాష్ట్ర అభివృద్ధిని సాధ్యమని రాజేంద్రనగర్ BRS ఇంఛార్జ్ కార్తీక్ రెడ్డి పేర్కొన్నారు. ఈరోజు శంషాబాద్ డీవిజన్ నేత రాజమల జయసింహ ఆధ్వర్యంలో చిన్న గోల్కొండ గ్రామానికి చెందిన పలువురు నేతలు కార్తీక్ రెడ్డి సమక్షంలో BRSలో చేరారు. కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసిగిపోయారని రాబోయేది BRS ప్రభుత్వమేనని పేర్కొన్నారు.

March 5, 2026 / 08:12 PM IST

‘సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగాలి’

SDPT: హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ మల్లికార్జున్ అధ్యక్షతన వార్డు ఆఫీసర్లతో సమీక్షా సమావేశం జరిగింది. 99 రోజుల ప్రత్యేక ప్రణాళికలో భాగంగా ప్రతి అధికారి బాధ్యతగా పనిచేయాలన్నారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో భాగస్వాములు కావాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగాలని ఆదేశించారు.

March 5, 2026 / 08:10 PM IST

మండల పాఠశాలను సందర్శించిన కలెక్టర్

GDWL: పదో తరగతి విద్యార్థి భవిష్యత్తుకు పునాది, ప్రతి విద్యార్థి 570కి పైగా మార్కులు సాధించేలా పట్టుదలతో చదవాలి అని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా పేర్కొన్నారు. గురువారం గట్టు మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను సందర్శించారు. రాబోయే పది రోజులు అత్యంత కీలకమని, చదువుతో పాటు ఆరోగ్యంపై దృష్టి సారించి సమతుల్య ఆహారం తీసుకోవాలన్నారు.

March 5, 2026 / 08:10 PM IST

భగలాముఖి దేవిని దర్శించుకున్న అదనపు ఎస్పీ

MDK: శివంపేట శ్రీ భగలాముఖి దేవి శక్తి పీఠాన్ని దర్శించిన అదనపు ఎస్పీ ఎస్. మహేందర్ దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు దేవస్థాన అధికారులు, అర్చకులు సాదరంగా స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీర్వాదాలు పొందారు. జిల్లా ప్రజలు శాంతి, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఇందులో ఎస్ఐ మధుకర్ రెడ్డి పాల్గొన్నారు.

March 5, 2026 / 08:10 PM IST

‘జీపీ కార్మికులను కాంగ్రెస్ మోసం చేసింది’

KNR: జీపీ కార్మికులను కాంగ్రెస్ మోసం చేసిందని, సీఐటీయూ జిల్లా కార్యదర్శి కొప్పుల శంకర్ అన్నారు. ఆకునూరి సుధాకర్ అధ్యక్షతన హుజురాబాద్ హమాలీ యూనియన్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. జీపీ కార్మికులకు మూడు నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం వేతనాలు చెల్లించడం లేదని అన్నారు. మేనిఫెస్టోలో పెట్టిన విధంగా పంచాయతీ కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలన్నారు.

March 5, 2026 / 08:08 PM IST

‘ప్రైవేట్ లాడ్జీల నిర్వహకులు నిబంధనలు పాటించాలి’

SRCL: ప్రైవేటు లాడ్జిల నిర్వాహకులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని వేములవాడ పట్టణ సీఐ వీరప్రసాద్ సూచించారు. లాడ్జిలకు వచ్చే అతిధుల వద్ద పూర్తి ధృవీకరణ పత్రాలు తీసుకోవాలని, మైనర్లకు గదులు ఇవ్వవద్దని, లాడ్జీల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, రికార్డులు సరిగ్గా నిర్వహించాలని ఆయన సూచించారు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

March 5, 2026 / 08:06 PM IST