పెద్దపల్లి మండలం పెద్దబొంకూర్ గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన ఐశ్వర్య వివాహానికి ఏగోలపు కుమార్ గౌడ్ చారిటబుల్ ట్రస్టు సహాయం అందించింది. ట్రస్టు అధ్యక్షుడు ఏగోలపు సదయ్య గౌడ్ బియ్యం, పెళ్లి చీరను అందజేశారు. గత 21 ఏళ్లుగా నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
NGKL: హైదరాబాద్ ఏవీ కాలేజీలో ప్రారంభమైన తెలంగాణ సాహితీ దశాబ్ది ఉత్సవాలకు జిల్లా కవులు, రచయితలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. శనివారం జరిగిన మొదటిరోజు సమావేశంలో ప్రముఖ కవి, ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న, కథా రచయిత వహీద్ ఖాన్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో జిల్లా కవులు తాము రచించిన పలు పుస్తకాలను ఆవిష్కరించారు.
KMR: బాన్సువాడ రిలయన్స్ మార్ట్ వద్ద జరిగిన ఘటనపై మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టామని ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. ఈ క్రమంలో వ్యక్తిపై దాడి చేసిన వారు, రాళ్ల దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. పట్టణ ప్రజలు ఆందోళన చెందకుండా తమ రోజువారీ పనులు చేసుకోవాలని ఆయన సూచించారు.
MBNR: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో నేడు పంట ఉత్పత్తుల ధరలను కార్యదర్శి అశ్వక్ హైమద్ వెల్లడించారు. వేరుశనగ గరిష్టంగా రూ.10,621, పత్తి రూ.6,301 పలికింది. మినుములకు గరిష్ట ధర రూ.8,063 లభించగా, మొక్కజొన్న రూ.1,889 ధర పలికినట్లు తెలిపారు. ఆయా పంటల కనిష్ట ధరలు వేరుశనగకు రూ.4,669,పత్తికి రూ.4,001,మినుములకు రూ.7,150,మొక్కజొన్నకు రూ.1,701గా నమోదయ్యాయి.
BDK: కమ్యూనిస్టు పార్టీకి వందేళ్లు నిండిన సందర్భంగా ఫిబ్రవరి 27న సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో హైదరాబాదులో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇవాళ ఇల్లెందు IFTU కార్యాలయంలో పార్టీ నాయకులు వాల్ పొస్టర్లను ఆవిష్కరించారు. డివిజన్ కార్యదర్శి తుపాకుల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. బ్రిటిష్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ పోరాడిందన్నారు.
SRPT: నడిగూడెం మండలంలోని బృందావనపురం గ్రామానికి చెందిన కాసాని సాయి 74వ జాతీయ స్థాయి పురుషుల కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారు. నిరుపేద కుటుంబం నుంచి జాతీయ స్థాయికి ఎంపికైన సాయిని మండల కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ కోటి, కార్యదర్శి కరుణాకర్ అభినందించారు. ఈ సందర్భంగా సాయికి అవకాశం కల్పించిన రాష్ట్ర అధ్యక్షులు వీరేందర్ లకు కృతజ్ఞతలు తెలిపారు.
KMR: కామారెడ్డిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద శనివారం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా మూడంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి తెలిపారు. ఇరు పార్టీల నాయకులు సంయమనం పాటించాలని, చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బందికి ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ADB: గుడిహత్నూర్ మండలం డోంగర్గావ్ సర్పంచ్ అబ్దుల్ రహేమాన్ ఖాన్ స్థానిక అంగన్వాడీ కేంద్రాన్ని శనివారం సందర్శించారు. కేంద్రంలో రికార్డులను తనిఖీ చేసిన ఆయన పిల్లలకు అందిస్తున్న పోషకాహారం, విద్యా బోధన తీరును పరిశీలించారు. గర్భిణీలు, బాలింతలకు ప్రభుత్వ సేవలు సక్రమంగా అందేలా చూడాలని, శుభ్రత పాటించాలని సిబ్బందికి సూచించారు.
MBNR: సీఎం రేవంత్ రెడ్డిని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆయన నివాసంలో శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం సీఎంతో భేటీ అయిన ఎమ్మెల్యే ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై చర్చించారు. నియోజకవర్గంలోని మూడు మున్సిపాలిటీలను భారీ మెజార్టీతో కాంగ్రెస్ కైవసం చేసుకున్న సందర్భంగా సీఎం హర్షం వ్యక్తంచేస్తూ అభినందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
SRD: రాయికోడ్ మండలం ఔరంగ నగర్ లో బొంగుండేశ్వర విగ్రహం ప్రతిష్టాపన మహోత్సవం శనివారం ఘనంగా జరిగింది. గ్రామ కురుమ సంఘం అధ్యక్షులు విట్టల్ ఆధ్వర్యంలో రాష్ట్ర కురుమ సంఘం నాయకులు పైతర సాయికుమార్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఆయన మాట్లాడుతూ.. తన అద్భుత శక్తులతో మానవుల సమస్యలను పరిష్కరించి, గొప్ప వ్యక్తిగా మారిన వారిలో బొంగుండేశ్వర స్వామి ఒకరని కొనియాడారు.
NZB: బాన్సువాడలో శుక్రవారం రాత్రి ఘర్షణలో గాయపడ్డ కార్యకర్తలను పరామర్శించేందుకు బాన్సువాడకు వెళ్తున్న నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణను శనివారం పోలీసులు భిక్కనూర్ టోల్ గేట్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను భిక్కనూర్ పోలీస్ స్టేషన్ తరలించారు.
SDPT: రాయపోల్ మండలం ఎల్కల్ గ్రామానికి చెందిన పి. సతీష్ ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించిన ఇంటర్ కాలేజ్ నెట్ బాల్ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ పోటీలకు ఎంపికయ్యాడు. ఈ పోటీలు మార్చి 9 నుంచి 13 వరకు సేజ్ యూనివర్సిటీ మధ్య ప్రదేశ్లో జరుగనున్నాయి. దీంతో అతన్ని పలువురు అభినందించారు.
ASF: మున్సిపల్ ఛైర్పర్సన్ ఎన్నికల్లో పార్టీ విప్ను ధిక్కరించి ఓటింగ్ చేసినందుకు 13వ వార్డు కౌన్సిలర్ స్నేహపై చర్యలు తీసుకున్నారు. ప్రత్యేక అధికారి, RDO జారీ చేసిన షోకాజ్ నోటీసుకు ఆమె ఇచ్చిన వివరణను పరిశీలించి విప్ ధిక్కరణ నిజమని తేల్చారు. తెలంగాణ పురపాలక చట్టం-2019 ప్రకారం ఆమెను కౌన్సిలర్ పదవి నుంచి అనర్హురాలిగా ప్రకటించారు.
BHPL: కొడవటంచ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సందర్శించి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన స్పీకర్కు స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఘన స్వాగతం పలికి ఆలయ విశిష్టతను, ఆలయ పరిసరాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
RR: చేవెళ్ల నియోజకవర్గం శంకర్ పల్లి మున్సిపల్ పరిధిలోని రామంతపూర్లో ఎల్లమ్మ దేవాలయం మొదటి వార్షికోత్సవాన్ని గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని పురవీధుల గుండా ఊరేగించారు. కౌన్సిలర్ బండ్లగూడ ప్రశాంత్, గ్రామ పెద్దలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.