తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్ కుమార్ కొనసాగింపును రద్దు చేసింది. రాష్ట్ర విభజన సమయంలో సోమేశ్ కుమార్ను కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించింది. దీనిపై సోమేశ్ కుమార్ కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. క్యాట్ ఉత్తర్వులు జారీచేయగా సోమేశ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర క్యాడర్గా కొనసాగుతున్నారు. ఇప్పుడు ఉన్నత పదవీ (సీఎస్)గ...
కేటుగాళ్లు దేనిని వదలడం లేదు. అవును ఎక్కడ అవినీతికి ఛాన్స్ ఉంటే అక్కడ కరప్షన్ చేస్తున్నారు. చివరికీ వైన్ షాపు టెండర్లను కూడా విడిచి పెట్టలేదు. వైన్ షాపు కోసం టెండర్ వేసే సమయంలో చలాన్ ఇస్తుంటారు. అయితే అందులో రూ.కోటి రూపాయలకు పైగా నకిలీ చలాన్లు ఉన్న విషయం ఆలస్యంగా బయటపడింది. ఇందులో బ్యాంక్ క్యాషియర్ పాత్ర ఉందని నిర్ధారించారు. ఈ స్కాం బయటపెట్టింది ఎక్సైజ్ సీఐ కావడం విశేషం. వరంగల్ రూరల్ జిల్లా వర్...
దక్షిణాదికి గేట్వే గా భావిస్తున్న తెలంగాణలో ఈసారి ఎలాగైన అధికారంలోకి రావడానికి బీజేపీ శాయశక్తులా పని చేస్తోంది. పక్కా గేమ్ ప్లాన్తో ముందుకు సాగుతోంది. అందివచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేదు. ఇక్కడ తమకు అంతగా బలం లేకపోవడంతో ఆయా ప్రాంతాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్లపై తీవ్ర అసంతృప్తితో ఉన్న బలమైన అభ్యర్థులను దరి చేర్చుకోవడం, కార్యకర్తలకు ఎప్పటికప్పుడు దిశా నిర్దేశనం, ఎన్నికల...
ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. తన దగ్గర పని చేసే డ్రైవర్ కి ఇన్సూరెన్స్ చేయించాడు. అనంతరం దారుణంగా హత్య చేశాడు. ఆ ద్వారా ఇన్సూరెన్స్ డబ్బు కొట్టేయాలని ప్లాన్ వేశాడు. ఆ ప్లాన్ బెడసికొట్టి.. దొరికిపోయాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకోగా…. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. పోలీసుల వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం జల్లి గ్రామం బోడ...
పార్టీ ఫిరాయింపుల అంశంపై కాంగ్రెస్ పార్టీ కదం తొక్కింది. ఈ అంశంపై సీఎస్కు ఫిర్యాదు చేసేందుకు టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నేతృత్వంలో బృందం ప్రయత్నించింది. అపాయింట్ మెంట్ లభించకపోవడంతో డీజీపీతో సమావేశం అయ్యారు. దీంతోపాటు నాగర్ కర్నూల్ పర్యటనలో జరిగిన దాడిని గురించి డీజీపీ అంజనీకుమార్కు వివరించారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని.. తమ శ్రేణులపై దాడి చేసి, తిరిగి వారిపైనే కేసులు పెట్టారని ఫై...
ప్రభుత్వానికి వ్యతిరేకంగా సర్పంచులు చేస్తున్న ధర్నాలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై విమర్శల వర్షం కురిపించారు. రాష్ట్ర ప్రభుత్వం సర్పంచులను సమస్యల్లో పడేసిందని పేర్కొన్న ఆయన ప్రభుత్వం వైఖరితో కొందరు ఆత్మహత్యలు చేసుకుంటే.. ఇంకొందరు పుస్తెలు అమ్ముకున్న పరిస్థితి ఉందని అన్నారు. సర్పంచుల నిరసనకు సంఘీభావంగా ధర్నా చేస్తామంటే ప్రభుత్వం...
తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల వ్యుహకర్త సునీల్ కనుగోలును సైబర్ క్రైమ్ పోలీసులు విచారించారు. ఫేస్ బుక్ పేజీలో సీఎం కేసీఆర్ అండ్ ఫ్యామిలీకి వ్యతిరేకంగా పెట్టిన పోస్టుల గురించి పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణకు హాజరుకావాలని కోరగా, ఇవాళ సునీల్ వచ్చారు. వీడియో మార్పింగ్, పోస్టింగుల గురించి పలు ప్రశ్నలు వేశారు. విచారణలో ఆయన చెప్పిన సమాధానాలను రికార్డ్ కూడా చేశారు. కేసు విషయమై మళ్లీ పిలిస్తే కూడా రావాల...
ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారిన తర్వాత, జనాల్లోకి వెళ్లబోతుంది. తొలి బహిరంగ సభను ఈ నెల 18వ తేదీన నిర్వహించబోతుంది. ఖమ్మంలో కలెక్టరేట్ భవన సముదాయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. ఆ ప్రాంగణంలోనే భారీ సభ ఏర్పాటు చేస్తున్నారు. సభ వేదికపై ఇతర రాష్ట్రాల సీఎంలు, మాజీ ముఖ్యమంత్రులు, కీలక నేతలతో కేసీఆర్ ఉంటారు. నిన్న (ఆదివారం) రోజున జిల్లాకు చెందిన మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీ నామా నాగేశ్వరరావ...
తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. సమయం చూసి కొందరు నేతలు పార్టీ ఛేంజ్ అవుతున్నారు. కొత్త పార్టీలో ప్రాధాన్యం, పదవులపై డిస్కస్ చేసి మరీ గోడ దూకెస్తున్నారు. ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి కీలకమైన నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. గత కొన్నిరోజుల నుంచి పార్టీతో అంటిముట్టనట్టుగా ఉంటున్నారు. అందుకు పలు కారణాలు ఉన్నాయి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారుతారని ఊహాగానాలు వ...
ఐటీ ఉద్యోగ కల్పనలో బెంగళూరును తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ దాటి వేసిందని మంత్రి కేటీ రామారావు అన్నారు. అయితే ఇక్కడ బెంగళూరును తక్కువ చేసి చూపించాలనేది తన ఉద్దేశ్యం కాదని, తాము అధికారంలోకి వచ్చాక అన్నింటా అభివృద్ధి దూసుకు వెళ్తోందన్నారు. దేశవ్యాప్తంగా ఐటీ రంగంలో 5 మిలియన్ ఉద్యోగాలు ఉంటే, ఇందులో 1 మిలియన్ ఉద్యోగాలు కేవలం హైదరాబాద్, తెలంగాణ నుండే ఉన్నాయన్నారు. అంటే 20 శాతం హైదరాబాద్ నుండి ఉంద...
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ మంత్రి కేటీఆర్.. సవాల్ విసిరారు. తాను చెప్పేది తప్పయితే… తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కేటీఆర్ చెప్పారు. అదే.. మీరు చెప్పేది తప్పైతే కేంద్ర మంత్రి పదవి వదిలి పెట్టకపోయినా.. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సోయి లేకుండా మాట్లాడుతున్నారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్ష, పరోక్ష పన...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 12మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాంయిపుల విషయమై రేవంత్ రెడ్డి ఈ రోజు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో కేసీఆర్ పై రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను కొన్నారని 2014లో టీడీపీలో గెలిచిన తలసానిని మంత్రిని చేశారని అన్నారు. ఇక 2018 వరకు ఫిరాయ...
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కేసీఆర్ అడ్డంగా బుక్కయ్యారా? తానొకటి తలిస్తే, మరొకటి జరిగి ఇరుకున పడ్డారా? ఓ వైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్ మధ్య చిక్కుకుపోయారా? మునుగోడు కోసం వేసిన స్కెచ్, అసెంబ్లీ ఎన్నికలకు ముందు టెన్షన్ పెడుతోందా? కోర్టులో వరుస షాక్లు ప్రభావం చూపిస్తాయా? ఇప్పుడు బీఆర్ఎస్ నేతలను తొలిచివేస్తున్న అంశాలు. మునుగోడు ఉప ఎన్నికలకు ముందు జరిగిన ఫామ్ హౌస్ నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు అంశం ఇ...
తెలంగాణ కాంగ్రెస్లో విభేదాలు ఎటువైపు వెళ్తున్నాయో, వెళ్తాయో అర్ధం కానీ పరిస్థితి. ఓ వైపు రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్న పార్టీ ఇంచార్జ్ మాణిక్కం ఠాకూర్ను తప్పించింది అధిష్టానం. అదే సమయంలో సీనియర్లు రేవంత్ను తొలగించాలని చెప్పినప్పటికీ, ఆయననే కొనసాగిస్తోంది. వచ్చే ఎన్నికలను ఆయన సారథ్యంలోనే కాంగ్రెస్ ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి మధ్యేమార్గంగా ఇరువురిని చల్లబరిచే ప్రయత్నాలు చేస...
కామారెడ్డి మాస్టర్ ప్లాన్కు వ్యతిరేకంగా గ్రామాల రైతులు బంద్ కి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. కాగా… ఈ బంద్ కి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్ధతు ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు. కామారెడ్డి రైతు జేఏసీ ఇచ్చిన బంద్కు కాంగ్రెస్ శ్రేణులు మద్దతు ఇచ్చి పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కామార...