2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశంతో పొత్తుపై బీజేపీ రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్ స్పందించారు. తమకు టీడీపీతో పొత్తు పెట్టుకోవాలనే ఆసక్తి లేదన్నారు. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో బలమైన టీడీపీతో కలిసి వెళ్లాలని బీజేపీ భావిస్తోందని వార్తలు వచ్చాయి. అయితే అలాంటి ఆలోచన ఇప్పుడు లేదని తరుణ్ చుగ్ స్పష్టం చేశారు. టీడీపీ – బీజేపీ పొత్తు వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప...
సినిమా అనౌన్స్మెంట్ అయితే చాలు.. రిలీజ్ వరకు అంచనాలు ఆకాశాన్నంటుతునే ఉంటాయి. మేకర్స్ జస్ట్ అలా హింట్ ఇస్తే చాలు.. ఫ్యాన్స్ దాన్ని అల్లుకుపోయి విపరీతమైన అంచనాలను పెంచెసుకుంటారు. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అప్ కమింగ్ ప్రాజెక్ట్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై కూడా హైప్ స్టార్ట్ అయింది. భవదీయుడు భగత్ సింగ్ కాస్త ఉస్తాద్ భగత్ సింగ్గా మారడంతో.. ఈ సినిమా పై రకరకాల ఊహగానాలొస్తున్నాయి. తేర...
కత్తులు కట్టకుండా కోడి పందేలు నిర్వహిస్తే బాగుంటుందని మాజీ ఎంపీ, ప్రముఖ నటుడు మోహన్ బాబు వ్యాఖ్యానించారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా తిరుపతిలోని తన శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల ఆవరణలో కుటుంబ సభ్యులు, విద్యార్థులతో కలిసి ఆయన శనివారం బోగి సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. సంక్రాంతికి కోడి పందేలు నిర్వహించడం సంప్రదాయంగా వస్తోందన్నారు. ఈ పందేలు నిర్వహించడం తప్పా, రైటా అంటే, అది మ...
I just met god: Rajamouli after meeting with Steven Spielberg దేవుడ్ని కలిశా: స్పీల్బర్గ్తో రాజమౌళి ఆనందం ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి హాలీవుడ్ ఫిల్మ్ మేకర్ స్టీవెన్ స్పీల్బర్గ్ను కలిశారు. ఆస్కార్ ఓటింగ్లో భాగంగా లాస్ ఏంజెల్స్లో నిర్వహించిన యూనివర్సల్ పార్టీలో స్పీల్బర్గ్తో కలిసి ఫోటోలు దిగి, వాటిని సోషల్ మీడియా అనుసంధాన వేదిక ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అంతేకాదు, ఇప్పుడే నే...
బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పు చేసినవాడే తలవంచుతాడని, తాను ఇంతవరకు రాజకీయాల్లో ఎవరికీ తలవంచలేదని తేల్చిచెప్పారు. ఇకపై తలొగ్గబోనని హాట్ కామెంట్స్ చేశారు. రాజకీయ జీవితంలో ఎవరికి పాదాభివందనం చేయలేదని స్పష్టంచేశారు. డబ్బులు సంపాదించడం కాదు.. ఆత్మగౌరవంతో బతకాలని కోరారు. కడియం శ్రీహరికి ఎమ్మెల్యే రాజయ్య మధ్య విభేదాలు ఉన్నాయి. చాలా సందర్భాల్లో ఇద్దరు నేతలు ...
సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నగరం ఖాళీ అయింది! వరుసగా మూడు రోజుల పాటు బోగి, సంక్రాంతి, కనుమ ఉండటంతో ఉభయ తెలుగు రాష్ట్రాలలోని వారంతా తమ ఊళ్లకు వెళ్లారు. ఇప్పటికే గురువారం నుండే హైదరాబాద్ నుండి వరుసగా పండుగ ప్రయాణాలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం నాటికి ఇసుక వేస్తే రాలనంత జనం ఉండే హైదరాబాద్ నగర కూడలిలు ఇప్పుడు ఖాళీగా కనిపిస్తున్నాయి. కిలో మీటర్ దూరానికే అరగంట నుండి గంట పట్టే ట్రాఫిక్ జామ్ పరిస...
సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ప్రెస్ సంక్రాంతి పర్వదినం సందర్భంగా 15వ తేదీన ప్రారంభం కానుంది. ప్రధాని మోడీ ఆదివారం ఉదయం వర్చువల్గా దీనిని ప్రారంభిస్తారు. తొలి బ్లూ అండ్ వైట్ కలర్ వందే భారత్ నవంబర్ 11, 2022న మైసూరు-బెంగళూరు-చెన్నై మధ్య ప్రారంభమైంది. వీటి మధ్య దూరం 698 కిలో మీటర్లు కాగా, ప్రయాణ సమయం ఎనిమిదిన్నర గంటలు. మొదటి సెమీ హైస్పీడ్ వందేభారత్ మాత్రం ఢిల్లీ కాన్పూర్, అ...
బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లాలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి స్పందించారు. బీఆర్ఎస్ జాతీయ పార్టీగా ప్రకటించాక 18వ తేదీన తొలిసారి ఈ సభను నిర్వహిస్తోంది. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ సీఎం, పలు పార్టీల అధ్యక్షులు హాజరవుతున్నారని తెలుస్తోంది. ఈ సభపై రేణుకా చౌదరి మాట్లాడుతూ… తెలంగాణలో ఈశాన్య దిక్కు స్థానికులకే కలిసి వస...
క్యాసినో కేసు, విదేశాలకు డబ్బు మళ్లించారనే అభియోగాలతో చీకోటి ప్రవీణ్ కుమార్ను ఈడీ విచారిస్తోన్న సంగతి తెలిసిందే. కేసు వెలుగుచూసిన వెంటనే ప్రవీణ్ రాయల్ లైఫ్, ఫామ్ హౌస్లో అతని పెట్స్ చర్చకు వచ్చాయి. ఇప్పుడు చీకోటి ప్రవీణ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. సంక్రాంతి పండగ సందర్భంగా ఏపీలో కోడొ పందాలు చూసేందుకు వచ్చానని ఆయన చెబుతున్నారు. అంతేకాదు క్యాసినో కేసుకు సంబంధించి అందరి పేర్లు బయటపెడతానని ప్రవీణ్ హా...
నేడు ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి జయంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నివాళులర్పించారు. రాష్ట్రానికి ఆయన చేసిన సేవలను సంజయ్ కొనియాడారు. తొలి తెలంగాణ ఉద్యమ నేత మర్రి చెన్నారెడ్డి అంటూ ఆయన ఉద్యమ స్ఫూర్తిని గుర్తుచేసుకున్నారు. హైదరాబాద్ లో వేలకోట్ల నిజాం అక్రమ ఆస్తులను, స్థలాలను కబ్జా కాకుండా అడ్డుకొని తెలిపారు. అవీ ప్రజలకు ఉపయోగపడేలా చేశారని గుర్తుచేశారు. 1969లో తెలం...
థియేటర్లో వీరసింహారెడ్డి ఊచకోతకు.. రికార్డులు బద్దలవుతున్నాయి. అఖండ బ్లాక్ బస్టర్.. అన్ స్టాపబుల్ టాక్ షో.. బాలయ్య క్రేజ్ను పీక్స్కు తీసుకెళ్లాయి. ఇలాంటి సమయంలో క్రాక్ బ్లాక్ బస్టర్తో జోష్ మీదున్న గోపీచంద్ మలినేని.. బాలయ్యతో వీరసింహారెడ్డి తెరకెక్కించాడు. దానికి తోడు మైత్రీ మూవీ మేకర్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మించడం.. సినిమా పై భారీ హైప్ తీసుకొచ్చింది. అందుకు తగ్గట్టే బాలయ...
ఉమ్మడి ఖమ్మం జిల్లా కీలక నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చల్లబడ్డారా.. అంటే అవుననే చెప్పవచ్చు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించారు. మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రాల్లో సమీకృత కలెక్టరేట్ కార్యాలయాలు, పార్టీ కార్యాలయాలు ప్రారంభించారు. కొత్తగూడెం పర్యటనలో తుమ్మల మొదటి నుండి చివరి వరకు అధినేత కేసీఆర్ వెంటే ఉన్నారు. ఆయనను సీఎం ఆత్మీయంగా పలకరించారు. కలెక్ట...
మహబాబాబాద్ జిల్లాకు సీఎం కేసీఆర్ నిధుల వరద పారించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ సముదాయాన్ని ఇవాళ ప్రారంభించిన తర్వాత ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదికపై మాట్లాడారు. మహబూబాబాద్, తిరుమలగిరి, వర్ధన్నపేట ప్రాంతాల్లో గతంలో పూర్తికాని కాలువలను చూసి మనసు చలించేందని గుర్తుచేసుకున్నారు. ఆదివాసీ, గిరిజన ప్రాంతాల్లో వెలుగు నిండాలనే ఉద్దేశంతో జిల్లాలు ఏర్పాటు చేసుకోవడం జరిగిందని వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఓ ...
తమిళనాడు మాజీ సీఎస్, జనసేన సలహాదారు ఆర్ రామ్మోహన్ బుధవారం నాడు ప్రగతి భవన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈయన ఆంధ్రప్రదేశ్కు చెందిన కాపు నేత. ఇటీవలే తోట చంద్రశేఖర్ తదితర కాపు నేతలు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో మరో కాపు నేత కేసీఆర్ ని కలవడం చర్చకు దారి తీసింది. ఈ భేటీ సమయంలో ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షులు కాపు చంద్రశేఖర్, బీఆర్ఎస్ నేత పార్థసారథి [&hel...
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడనున్నారని వార్తలు వేగం పుంజుకున్నాయి. త్వరలో ఎన్నికలు రానున్న తరుణంలో పొంగులేటి పార్టీలోంచి బయటకు రావడం బీఆర్ఎస్ పార్టీకి భారీ దెబ్బ. అసెంబ్లీ ఎన్నికలకు మరో పది నెలల గడువు ఉంది. ఈ సమయంలో తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. 18వ తేదీన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ భారీ సభను కూడా ప్లాన్ చేసింది. అదే సమయంలో పొంగులేటి కమలం తీర్థం పుచ్...