SRCL: ఇల్లంతకుంటలో ఆరోగ్యలక్ష్మి పథకం అమలును బలోపేతం చేసేందుకు అంగన్వాడీ స్థాయి పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేశారు. సమావేశానికి గ్రామ సర్పంచ్ ఎం.రాజు అధ్యక్షత వహించి తల్లి–బిడ్డల ఆరోగ్యమే గ్రామాభివృద్ధికి మూలమన్నారు. 12వ వార్డు సభ్యుడు కూనబోయిన రఘు చిన్నారులకు పలకలు, బలపాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అధికారులు, అంగన్వాడీ సిబ్బంది, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
NLG: చింతపల్లి మండలం మాల్ పట్టణంలో ఏర్పాటు చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పున్న కైలాష్ నేతతో కలిసి ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ ఆవిష్కరించి నివాళులర్పించారు. తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమానికి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అందించిన ప్రజాస్వామిక స్ఫూర్తి, చేసిన త్యాగం మరువలేనిదని ఎమ్మెల్యే తెలిపారు.
NZB: నగరపాలక సంస్థ మేయర్గా కూరగాయల ఉమారాణి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. మంత్రి పొన్నం ప్రభాకర్, TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సమక్షంలో ఆమె అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం మాట్లాడుతూ.. నగరాభివృద్ధి ద్యేయంగా పనిచేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, డీసీసీ అధ్యక్షుడు కాట్పల్లి నగేశ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
MNCL: ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లాలో బడిబయట పిల్లల గుర్తింపు సర్వే పూర్తి చేశామని DEO యాదయ్య శుక్రవారం ప్రకటనలో తెలిపారు. నివేదికలు రాష్ట్ర విద్యాశాఖకు అందించి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని అన్నారు. తల్లిదండ్రులతో మాట్లాడి చదువులకు దూరంగా ఉన్నవారిని ఆయా పాఠశాలల్లో చేర్పించి చదువుకునేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
SRPT: తిరుమలగిరి మండలం తాటిపాములలో ఇందిరమ్మ ఇళ్లకు శుక్రవారం ఎమ్మెల్యే సామేలు భూమి పూజ చేశారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను పేదలు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బోయపల్లి కిషన్ పాల్గొన్నారు.
NRML: నూతనంగా ఎన్నికైన నిర్మల్ మున్సిపల్ ఛైర్ పర్సన్ అప్పల కావ్య, వైస్ ఛైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తిలను ట్రస్మా జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ.. విద్యారంగ సమస్యల పరిష్కారానికి సహకరిస్తే చాలా సమస్యలు దూరం అవుతాయని కోరారు.
ASF: తిర్యాణి జడ్పీ పాఠశాలను శుక్రవారం జిల్లా కలెక్టర్ హరిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల భవన నిర్మాణ పనులను పరిశీలించి, విద్యార్ధులతో మాట్లాడారు. హాజరు శాతం తక్కువగా ఉండటంపై ప్రధానోపాధ్యాయుడు అంజయ్యను వివరణ కోరారు. విద్యార్థులు క్రమం తప్పకుండా బడికి వచ్చేలా చూడాలన్నారు. అనంతరం టీచర్లా మారి విద్యార్థులకు పాఠాలు బోధించారు.
SRCL: పేదల సొంతింటి కలను నిజం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం వేములవాడ పట్టణంలో 14, 19 వార్డుల్లో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై నూతన వస్త్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ADB: భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు రాజు శుక్రవారం ఆదిలాబాద్లోని సంఘం కార్యాలయంలో మాట్లాడుతూ.. నిర్మాణ రంగంలో పనిచేసే లేబర్ వెల్ఫేర్ బోర్డును ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నదని ఆరోపించారు. భవన నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 23న కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు.
RR: షాద్నగర్లోని ప్రధాన చౌరస్తా విస్తరణ పనులను ప్రాధాన్యత క్రమంలో చేపట్టాలని కోరుతూ సామాజిక కార్యకర్త రాజు నూతన మున్సిపల్ చైర్మన్కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాహనదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని మున్సిపల్ కౌన్సిల్లో ప్రవేశపెట్టే తొలి తీర్మానంలోనే చౌరస్తా విస్తరణ అంశాన్ని చేర్చాలన్నారు.
BDK: ప్రాజెక్టు అధికారి టేకులపల్లిలో గ్రంథాలయ భవనాన్ని కట్టిస్తామని పీవో రాహుల్ చెప్పారు. టేకులపల్లి శాఖ గ్రంథాలయాన్ని శుక్రవారం భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రాహుల్, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ పసుపులేటి వీరబాబు సందర్శించారు. స్థానిక గ్రంథాలయాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వారితో గ్రంథ పాలకుడు నాగన్న పాల్గొన్నారు.
NRPT: మద్దూర్ మున్సిపాలిటీ ఛైర్మన్ పదవి ఇస్తామని ముదిరాజ్ బిడ్డకు అన్యాయం చేశారని దౌల్తాబాద్ మాజీ జడ్పీటీసీ మైపాల్ మండిపడ్డారు. గోవిందుకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అడిగినందుకు సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి ముదిరాజ్ బిడ్డలపై లాఠీ ఛార్జ్ చేయించడం తగదని హెచ్చరించారు. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు.
NGKL: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని MLA రాజేష్ రెడ్డి అన్నారు. నాగర్కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డులో ఇవాళ ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశం కార్యక్రమంలో పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ తీగల సునేంద్ర, వైస్ ఛైర్మన్ బదం రమేష్ పాల్గొన్నారు.
SDPT: తెలంగాణ ఉద్యమంలో ప్రస్తుత మంత్రి పొన్నం ప్రభాకర్ క్రియా శ్రీలంక పాత్ర పోషించారు. 2009-2014 మధ్య కరీంనగర్ ఎంపీగా పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం వాదించారు. ‘సకల జనుల సమ్మె’, మిలియన్ మార్చ్లో పాల్గొంటూ, పార్టీలతో సంబంధం లేకుండా తెలంగాణ కోసం పోరాడిన నిజమైన ఉద్యమకారుడుగా నిలిచారు. లోక్సభలో తెలంగాణ బిల్లు ప్రవేశ పెడుతున్నప్పుడు గాయపడ్డారు.
MBNR: జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్లో తెలంగాణ ఉద్యమాకారుల సన్నాహాక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ తొలి ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ పిడమర్తి రవి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున నడిపిన ఘనత ఉద్యమకారులదన్నారు. గుర్తింపు కార్డులు, పెన్షన్, ఇందిరమ్మ ఇళ్లు, 25 లక్షల ఎక్స్గ్రేషియా తదితర హామీలు అమలు చేయాలన్నారు.