GDWL: ఆంధ్రప్రదేశ్-కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులో ఉన్న గద్వాల జిల్లాలో పరిశ్రమలు స్థాపించాలని ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కోరారు. హైదరాబాద్లో బుధవారం పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబును కలిసి వినతి పత్రం అందించారు. పరిశ్రమలు ఏర్పాటు చేసి నడిగడ్డ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.