KDP: బ్రహ్మంగారిమఠం మండల ఇన్ఛార్జ్ తహసీల్దారుగా వేల్పుల రాజసింహ నరేంద్ర బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఆయనకు రెవెన్యూ సిబ్బంది స్వాగతం పలికి పరిచయం చేసుకున్నారు. అనంతరం ఇన్ఛార్జ్ తహసీల్దారు రెవిన్యూ అధికారులతో వీరబ్రహ్మేంద్రస్వామి వారి ఉత్సవాల్లో ఏర్పాట్లపై సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.