ASR: యుద్ధ సమయంలో మనందరం సివిల్ డ్రెస్లో ఉన్న సైన్యంలా విధులు నిర్వహించి, ప్రజలను రక్షించే భాద్యత చేపట్టాలని కలెక్టర్ దినేష్ కుమార్ సూచించారు. బుధవారం కలెక్టరేట్లో మాక్ డ్రిల్ పై సమావేశమయ్యారు. పహల్గాంలో జరిగిన ఘటన నేపధ్యంలో భారత్, పాక్ మధ్య యుద్ధం నెలకొనే అవకాశం ఉందని నిఘా వర్గాల హెచ్చరికలతో, యుద్ధం సంభవిస్తే ఎదుర్కొనే విధానాలు గురించి చర్చించారు.