VZM: విజయనగరంలో గల ఘోషా ఆసుపత్రిని ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతి రాజు బుధవారం సందర్శించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నికలు ముగిసిన వెంటనే ఘోష ఆసుపత్రి మరియు జిల్లా కేంద్ర ఆసుపత్రిని సందర్శించడం జరిగిందని, ఆసుపత్రులలో ఉన్న సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తున్నామని అన్నారు.