VKB: తాండూర్ మున్సిపల్ పరిధిలో దీర్ఘకాలంగా ఇంటి పన్ను చెల్లించని బకాయిదారులకు మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి స్వయంగా ఇంటింటికి వెళ్లి రెడ్ నోటీసులు అందజేశారు. మొండి బకాయిలు ఉన్న యజమానులు వెంటనే స్పందించాలని, లేనిపక్షంలో మున్సిపల్ చట్టం- 2019 ప్రకారం ఆస్తులను జప్తు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ నరేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.