NZB: జింకను వేటాడిన కేసులో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు గురువారం రూరల్ ఎస్హెచ్వో శ్రీనివాస్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొన్నిరోజుల కిందట మల్లారం శివారులోని గుట్టల్లో జింకను హతమర్చారు. అటవీశాఖాధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.