కరీంనగర్: అక్కన్నపేట మండలానికి బుధవారం అంబులెన్స్ను కేటాయించారు. మారుమూల ప్రాంతాలు, గిరిజన తండాల ప్రజలు అత్యవసర సమయంలో ఇబ్బందులకు గురవుతున్న విషయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి మండల నాయకులు తీసుకువెళ్లడంతో వెంటనే ఆయన స్పందించి అక్కన్నపేటకు 108 అంబులెన్స్ను కేటాయించారు. ఇందుకు గాను మండల నాయకులు ప్రజల పక్షాన మంత్రి పొన్నంకు కృతజ్ఞతలు తెలిపారు.