NRML: ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన సన్న బియ్యం పేద ప్రజలకు వరమని అన్నారు. ఖానాపూర్ మండలం తర్లపాడు గ్రామంలోని లబ్ధిదారుని ఇంట్లో ఆమె మంగళవారం భోజనం చేశారు. కలెక్టర్ వెంట జిల్లా అధికారులు పాల్గొన్నారు.