NLG: నార్కట్ పల్లి మండల కేంద్రంలోని MPDO కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం 2 గం.కు స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం తన చేతుల మీదుగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను 50 మంది లబ్దిదారులకు అందజేయనున్నట్లు మండల కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. మండలంలోని లబ్దిదారులు సకాలంలో హాజరు కావాలని కోరారు.