MHBD: తొర్రూరు పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మున్సిపల్ ఛైర్మన్ తూనం శ్రావణ్ కుమార్ కోరారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఇవాళ మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బందిచే ప్రతిజ్ఞ చేయించారు. రాష్ట్ర ప్రభుత్వం 99 రోజుల ప్రజా పాలన-ప్రగతి పరిపాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని అన్నారు.