మేడ్చల్: మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ కుమార్ నేడు సఫీల్ గూడ లేక్ పార్క్లో రూ.40 లక్షలతో ప్రధాన ద్వారం, పెయింటింగ్ పనులు ప్రారంభించి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో EE లక్ష్మణ్, AE నవీన్, మహేష్, రమేష్ పర్యవేక్షణలో క్రేన్ సహాయంతో డోమ్ ఏర్పాటు జరిగింది. చెరువు పరిసరాల్లో గుర్రపు డెక్క పనులను పరిశీలించిన శ్రవణ్, వాటిని వేగవంతం చేయాలని AE వనజను కోరారు.