NLG: మన చేతిలోనే మన ఆరోగ్యం ఉంటుందని, అది యోగాతో సాధ్యం అవుతుందని బీజేపీ నల్లగొండ జిల్లా నాయకుడు మాదగోని నాగార్జున తెలిపారు. గురువారం చండూరు మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ ఆవరణంలో ఆయన యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రజలందరూ జరుపుకోవాలని కోరారు.