HYD: కూకట్ పల్లిలోని ప్రగతీనగర్ HMT హిల్స్ చెరువులో గార్బేజీ వ్యర్థాలు రోజురోజుకూ పెరుగుతున్నాయని స్థానికులు గురువారం ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు చెరువు మురికి కూపంగా మారుతోందని, నీటి ఉపపరీతలంపై పిచ్చి మొక్కలు పెరుగుతున్నట్లు పేర్కొన్నారు. సంబంధిత అధికారులు చెరువును పట్టించుకోకపోవడం ఏంటని, వెంటనే అభివృద్ధికి శ్రీకారం చుట్టాలని డిమాండ్ చేస్తున్నారు.