కృష్ణా: మోపిదేవి మండలం రావివారిపాలెంలో కలెక్టర్ డీకే బాలాజీ పర్యటించారు. గురువారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైద్య సిబ్బందిని వివరాలు అడిగారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. అవసరమైన సౌకర్యాలు కల్పించి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు.